Revanth Reddy : ఆ పార్టీలకు మునుగోడు అభ్యర్థులను ప్రకటించే ధైర్యం లేదు..!!
టీఆర్ఎస్, బీజేపీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ఆ పార్టీలకు మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్థులను ప్రకటించే దమ్ము, ధైర్యం లేదన్నారు
- By hashtagu Published Date - 09:05 PM, Sat - 10 September 22
టీఆర్ఎస్, బీజేపీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ఆ పార్టీలకు మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్థులను ప్రకటించే దమ్ము, ధైర్యం లేదన్నారు. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించడంతో…గాంధీభవన్ లో ముఖ్యనేతలంతా సమావేశం అయ్యారు. మునుగోడు టికెట్ ఆశించిన ఆశావాహులను రేవంత్ రెడ్డి బుజ్జగించారు.
కేసీఆర్ ను సంతోష పెట్టేందుకు ఆ పార్టీ నాయకులు…జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నట్లు రేవంత్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రం అంధకారంలో ఉందన్నారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి సంబంధించి పలువురు సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 18 నుంచి ప్రచారం ప్రారంభించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ తోపాటు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ బోస్ రాజు సహా ఇతర సీనియర్ నేతలు మునుగోడు ఉపఎన్నికపై చర్చించారు.
Related News
Lok Sabha Elections 2024: ముగిసిన తొలి దశ పోలింగ్, ఎక్కడ, ఎంత శాతం పోలింగ్ అయింది?
దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మొదటి దశ ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 7 గంటలకు ముగిసింది. ఎండని సైతం లెక్క చేయకుండా రోజంతా ఓటు వేయడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. అన్ని వర్గాల ప్రజలు ఓటింగ్లో ఉత్సాహాన్ని ప్రదర్శించారు.