BRS Party: కాంగ్రెస్, బీఆర్ఎస్ ‘పథకాల’ లొల్లి, కేటీఆర్ నిరసన పోరు!
- Author : Balu J
Date : 06-01-2024 - 6:25 IST
Published By : Hashtagu Telugu Desk
BRS Party: కాంగ్రెస్ ప్రభుత్వం తన హయాంలో ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను కూడా నీరుగార్చిందని వాటిని పక్కన పెట్టే యోచనలో ఉందని BRS ఆరోపించింది. ఈ అంశంపై ప్రజలకు తెలియజేయాలని మరియు అవగాహన కల్పించాలని దాని పార్టీ నాయకులు మరియు కార్యకర్తలకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు, పార్టీ సీనియర్ నాయకుడు టి. హరీష్ రావు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పార్టీ నిరసనలు నిర్వహించాలని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అమలు చేసిన గృహలక్ష్మి, గొర్రెల పంపిణీ పథకాలను కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఏళ్ల తరబడి లక్షలాది మందికి సాయం చేసిన పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. కాంగ్రెస్ చర్యల వల్ల లబ్ధిదారులెవరైనా ప్రయోజనాలు కోల్పోతే బీఆర్ఎస్ మౌనంగా ఉండదని చెప్పారు.
కాగా కొత్త పథకం నేపథ్యంలో గృహలక్ష్మిని రద్దు చేస్తున్నట్లు జీవో జారీ చేసింది కాంగ్రెస్ సర్కారు. లబ్ధిదారులకు కలెక్టర్లు ఇచ్చిన మంజూరు పత్రాలను కూడా రద్దు చేశారు. ఇంటి స్థలం ఉన్న పేదలకు.. గృహ నిర్మాణం కోసం రూ. 3 లక్షల ఆర్థిక సాయం చేసేందుకు గత ప్రభుత్వం గృహలక్ష్మి పేరుతో పథకాన్ని పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుత ప్రభుత్వం దాని స్థానంలో అభయహస్తం పథకాన్ని అమలు చేస్తోంది.
ఎన్నికలకు ముందు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి చేయూత ఇస్తామని మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొంది. ఈ నేపథ్యంలో గృహలక్ష్మి పథకానికి రద్దు చేస్తూ. ఆ స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకు రానుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా సొంత స్థలం ఉన్న పేదలు ఇంటిని నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు ఇవ్వనున్నారు.
అయితే ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.మూడు లక్షలను దశల వారీగా ఇవ్వాలని నిర్ణయించి అప్పటి కేసీఆర్ సర్కారు దరఖాస్తులను ఆహ్వానించింది. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల దరఖాస్తులు రాగా.. అందులో 12 లక్షల దరఖాస్తులు అర్హులుగా తేల్చారు. దీనికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాలు ఆయా జిల్లాల కలెక్టర్ల వద్దే ఉండగా.. కొందరికి మంజూరు పత్రాలను సైతం జారీ చేశారు.