HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >The Congress Coordination Committee Was Formed In Telangana To Implement Jai Bapu Jai Bhim Jai Samvidhan Abhiyan

Telangana Congress: ‘జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్’ సమన్వయ కమిటీ

ఈ ఆరుగురు నేతలతో సమన్వయ కమిటీ(Telangana Congress) ఏర్పాటుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆమోదం పొందినట్లు ఆయన వెల్లడించారు.  

  • By Pasha Published Date - 01:00 PM, Sun - 9 March 25
  • daily-hunt
Jai Bapu Jai Bhim Jai Samvidhan Telangana Congress Coordination Committee Rahul Gandhi

Telangana Congress: కాంగ్రెస్ పార్టీ జనవరి 26న ఉత్తరప్రదేశ్‌లోని మౌలో ‘జై బాపు , జై భీమ్ , జై సంవిధాన్ అభియాన్’‌ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.  ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని సమన్వయం చేసేందుకు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఆరుగురు నేతలకు చోటుదక్కింది. ఈ జాబితాలో  కాంగ్రెస్ నేతలు చల్లా వంశీచంద్ రెడ్డి, ఎస్. ఎ. సంపత్ కుమార్, ఎం. అనిల్ కుమార్ యాదవ్, తాహెర్ బిన్ హమ్దాన్, తజావత్ బెల్లయ్య నాయక్, వెన్నెల గద్దర్‌ ఉన్నారు. ఈమేరకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆరుగురు నేతలతో సమన్వయ కమిటీ(Telangana Congress) ఏర్పాటుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆమోదం పొందినట్లు ఆయన వెల్లడించారు.

Also Read :Kulbhushan Jadhav: కులభూషణ్‌‌ను పాక్‌కు పట్టించిన ముఫ్తీ షా మిర్‌ హతం.. ఎవరు ?

ఏమిటీ ప్రచార కార్యక్రమం ? 

‘జై బాపు , జై భీమ్ , జై సంవిధాన్ అభియాన్’ ప్రచార కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహించనుంది.ఇందులో భాగంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు అంబేద్కర్‌ను, రాజ్యాంగాన్ని ఎలా అగౌరవపర్చాయో చర్చించేందుకు ప్రతి జిల్లాలో గ్యాలరీలను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రచార కార్యక్రమానికి జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ సారథ్యం వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం పరిధిలో జరిగే పలు ర్యాలీల్లో ఆయన పాల్గొనే అవకాశం ఉంది.

Also Read :Dawood Ibrahim: రంగంలోకి దావూద్ గ్యాంగ్.. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ !

రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు

తాజాగా శనివారం రోజు (మార్చి 8న) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతలు కాంగ్రెస్‌లో ఉంటూనే బీజేపీకి బీ టీమ్‌గా పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలాంటి వాళ్లను తప్పకుండా ఫిల్టర్ చేస్తామని వెల్లడించారు. తాను ఎప్పుడు గుజరాత్‌కు వచ్చినా 2007, 2012, 2017, 2022, 2027 అంటూ ఎన్నికల సంవత్సరాల గురించి రాష్ట్ర కాంగ్రెస్  నేతలు చెబుతున్నారే తప్ప..  మనం మన బాధ్యతలను ఎంతవరకు నిర్వర్తించామనేది ఎవరూ చెప్పడం లేదన్నారు. ప్రతీ నాయకుడు పార్టీపరమైన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే తప్పకుండా గుజరాత్ ప్రజలు ఆశీర్వదిస్తారని తెలిపారు. నాయకులంతా పార్టీపరమైన బాధ్యతలను నెరవేర్చే వరకు అధికారం ఇవ్వమని రాష్ట్ర ప్రజలను అడగకూడదన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • Congress Coordination Committee
  • Jai Bapu Jai Bhim Jai Samvidhan
  • rahul gandhi
  • telangana
  • telangana congress

Related News

Heavy Rains

Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

Alert : ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలో కూడా ఈ అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 13 తర్వాత వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది

  • Hyderabad

    Hyderabad: గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!

  • Harish Rao

    Harish Rao: లండ‌న్‌లో జ‌రిగిన మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీష్ రావు!

  • New direction for Telangana education system: CM Revanth Reddy

    Telangana : తెలంగాణ విద్యావ్యవస్థకు కొత్త దిశ : సీఎం రేవంత్‌రెడ్డి

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: తెలంగాణలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష!

Latest News

  • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

  • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd