BRS: బీఆర్ఎస్కు షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర పార్టీ హోదా రద్దు
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పలు పార్టీలకు జాతీయ హోదా రద్దు చేయడంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా విషయంలో కీలక ప్రకటన చేశారు.
- By Nakshatra Published Date - 09:50 PM, Mon - 10 April 23
BRS: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పలు పార్టీలకు జాతీయ హోదా రద్దు చేయడంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా విషయంలో కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉండటంతో పాటు గుజరాత్ ఎన్నికల్లో గణనీయమైన ఓట్లను సంపాదించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా కల్పిస్తూ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. అలాగే తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), సీపీఐలకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆ మూడు పార్టీలకు జాతీయ హోదాను రద్దు చేసింది.
లోక్ సభ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా మారింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. యూపీలోని ఆర్ఎల్డీ, మణిపూర్లో పీడీఏ, పుదుచ్చేరిలో పీఎంకే, పశ్చిమ బెంగాల్లో ఆర్ఎస్పీ, మిజోరంలో ఎంపీసీలకు రాష్ట్ర పార్టీ హోదాను కూడా రద్దు చేశారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ(ఎం)తో సహా బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ), నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్సీపీ), ఆప్లు జాతీయ హోదా కలిగి ఉన్నట్లు తెలిపింది.
ఇక ఏపీలో బీఆర్ఎస్కు రాష్ట్ర పార్టీ గుర్తింపును కోల్పోగా.. తెలంగాణలో మాత్రమే రాష్ట్ర పార్టీగా గుర్తింపు దక్కింది. విభజన సమయంలో తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్కు రాష్ట్ర పార్టీ హోదా ఉంది. అయితే విభజన తర్వాత ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో ఏపీలో రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశంలో లోక్సభ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఇలాంటి నేపథ్యంలో పార్టీల గుర్తింపుపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Related News
NTR Shirt Colour: వైసీపీ పార్టీ కోసం ఎన్టీఆర్ ప్రచారం.. చొక్కా వైరల్
ఎన్టీఆర్ తన ఓటు వేయడానికి నీలం రంగు చొక్కా ధరించి వచ్చాడు. దీంతో వైసీపీ పార్టీ కోసమే ఆయన ఈ రంగు చొక్కా ధరించినట్లు వైసీపీ ప్రచారం చేసుకుంటుంది. ఎన్టీఆర్ నీలి చొక్కా వేసుకోవడం చూసి జూనియర్ ఎన్టీఆర్ చొక్కా వైసీపీ బ్లూ కలర్ తో ముడిపడి ఉందని భావించి