Ration Card Holders : రేషన్కార్డుదారులకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్
Ration Card Holders : సన్న బియ్యంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా ప్లాస్టిక్ కవర్లకు బదులుగా ప్రత్యేక పర్యావరణహిత బ్యాగులను పంపిణీ చేయనుంది.
- Author : Sudheer
Date : 15-08-2025 - 11:24 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు (Ration Card Holders) శుభవార్త తెలిపింది. వచ్చే నెలలో రేషన్ పంపిణీలో భాగంగా సన్న బియ్యంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా ప్లాస్టిక్ కవర్లకు బదులుగా ప్రత్యేక పర్యావరణహిత బ్యాగులను పంపిణీ చేయనుంది. ఈ బ్యాగులపై ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు, ‘అందరికీ సన్న బియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం’ అనే నినాదాన్ని ముద్రించారు. ఈ చొరవతో ప్రభుత్వం తన కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బ్యాగులు ఇప్పటికే జిల్లాల్లోని గోదాములకు చేరుకున్నాయి, వీటిని త్వరలో రేషన్ డీలర్లకు పంపిణీ చేయనున్నారు.
Cloudburst : జమ్మూకశ్మీర్ క్లౌడ్ బరస్ట్ .. 46కు చేరిన మృతుల సంఖ్య
అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రభుత్వం చేపట్టింది. జూలై 25 నుంచి ఆగస్టు 10 వరకు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఈ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మొదటి దశలో 5.61 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశారు. కొత్తగా కార్డులు పొందిన వారికి సెప్టెంబర్ నెల నుంచి రేషన్ సరుకులు అందించనున్నారు. జూలై 25న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. జూన్ నెలలో మూడు నెలల కోటా బియ్యాన్ని పంపిణీ చేసినందున, జూలై, ఆగస్టు నెలలకు సరుకులు ఇవ్వలేదు.
కొత్తగా మంజూరైన కార్డుల డిజైన్లు ఇంకా ఖరారు కానందున, ప్రస్తుతం ముఖ్యమంత్రి మరియు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో కూడిన మంజూరు పత్రాలను అందిస్తున్నారు. ఈ పత్రాలను చూపించి లబ్ధిదారులు సెప్టెంబర్ నుంచి రేషన్ తీసుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో సుమారు 96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి, వీటి ద్వారా సుమారు 3.10 కోట్ల మందికి సన్న బియ్యం సరఫరా అవుతోంది. కొత్తగా మంజూరైన కార్డులతో ఈ సంఖ్య మరింత పెరగనుంది. అర్హత ఉన్నవారు ఎప్పుడైనా మీసేవా కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఈ కొత్త కార్డుల ద్వారా లబ్ధిదారులు ఆరు గ్యారెంటీ పథకాలైన ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి వంటి వాటికి కూడా అర్హులు అవుతారు.