KCR : ఫాంహౌజ్ కుట్ర నిన్న మొన్న జరిగింది కాదు…వీడియో రిలీజ్ చేసిన సీఎం..!!
- By hashtagu Published Date - 09:15 PM, Thu - 3 November 22
ఫామ్ హౌజ్ వ్యవహారానికి సంబంధించిన వీడియోను తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాకు చూపించారు. ఆ వీడియోలో నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభానికి గురించి చేసిన విషయాలు ఉన్నాయి. అయితే ఈ ఘటనపై సీఎం సీరియస్ అయ్యారు. ఇది నిన్న మొన్న జరిగిన ఘటన కాదన్నారు. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఎనిమిది ప్రభుత్వాలను ఈ దేశంలో కూల్చామని వీడియోలో స్పష్టంగా ఉందన్నారు. మరో నాలుగు ప్రభుత్వాలను కూల్చుతామని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
గురువారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. దేశంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్న కేసీఆర్…తాను చాలా బాధతో మాట్లాడుతున్నాని తెలిపారు. 8సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశాన్ని…అన్ని రంగాల్లో వెనక్కి నెట్టిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాల్వాయి స్రవంతి తనను కలిసినట్లు బీజేపీ తప్పుగా ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్, దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడింందని…హుజుర్ నగర్, సాగర్ తాము గెలిచామన్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అన్న కేసీఆర్…సంయమానం పాటించడం చాలా అవసరమన్నారు. ఈసీ విఫలమైందని విమర్శిస్తున్నారన్నారు. ఈసీ వాళ్లకు అనుకూలంగా పనిచేస్తే…ఈసీని పొగిడేవాళ్లు కదా. ఇంత దిగజారుడు తనం ఎందుకంటూ ప్రశ్నించారు. ఇంత దుర్మార్గం ఎప్పుడూ చూడలేదన్న కేసీఆర్…ఉద్యమ సమయంలోనూ తాము ఇంత దారుణంగా ప్రవర్తించలేదన్నారు. దేశంలోని అన్ని పత్రికలు ఈ వీడియోలను పంపించినట్లు సీఎం చెప్పారు. ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ పెట్టి ప్రజాగ్రహానికి గురైన విషయాన్ని చెప్పారు. ఫాంహౌజ్ ఫైల్స్ 3గంటలు ఉన్నాయని..కోర్టుకు మొత్తం వీడియోలను సమర్పించినట్లు కేసీఆర్ తెలిపారు.
Related News
BRS Party: కెసిఆర్ ఓటమిని గ్రామీణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు : అల్లిపూరం
BRS Party: కొడంగల్ ఎన్నికల ఇన్చార్జి, మాజీ స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపూరం వెంకటేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విలేకరులతో మాట్లాడారు. కొడంగల్ నియోజకవర్గంలో 25 రోజులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించామని, గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ను ఓడించినందుకు కెసిఆర్ ఓటమిని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నానని, కొడంగల్ న