CM Revanth Delhi Tour: తెలంగాణకు సహకరించండి: మోడితో రేవంత్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. ఈ సమావేశంలో పెండింగ్ ప్రాజెక్టులపై
- By Praveen Aluthuru Published Date - 07:12 PM, Tue - 26 December 23
CM Revanth Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. రాజకీయ పరంగా కాకుండా రాష్ట్ర అభివృద్ధి విషయంలో పలు సమస్యలను విన్నవించారు. ఈ మేరకు తెలంగాణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. ఈ సమావేశంలో పెండింగ్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చర్చించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇందిరమ్మ ఇళ్లు, ఎన్ఆర్ఈజీఏ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పథకాలు, కేంద్ర ఆరోగ్య మిషన్ పథకాల కింద కేంద్రం ఇంకా నిధులు విడుదల చేయలేదు.
భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆయన ఏమన్నారంటే.. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో నేను ఈ రోజు మొదటిసారి మర్యాదపూర్వకంగా కలుసుకున్నాను. పెండింగ్లో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ప్రధానిని కోరాం. ఈ సమావేశంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు అని రేవంత్ రెడ్డి ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
After taking charge as the Chief Minister of Telangana, had a courtesy meeting today for the first time with the honourable Prime minister Shri @narendramodi ji.
We sought prompt resolution of the pending issues and cooperation for the development of the state from the PM.… pic.twitter.com/MAFOL57Re7
— Revanth Reddy (@revanth_anumula) December 26, 2023
Also Read: Kashmiri Kheema: నోరూరించే కాశ్మీరీ ఖీమా.. ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకోండిలా?
Related News
Iran Helicopter Crash: ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన
తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్లో ప్రతికూల వాతావరణం కారణంగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఇబ్రహీం రైసీ ఆదివారం అజర్బైజాన్లో ఒక డ్యామ్ను ప్రారంభించేందుకు అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్తో కలిసి వెళ్తున్నారు.