Bharat Jodo Yathra : తెలంగాణాలో రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్ ఫైనల్ ఇదే!
భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంణాలోకి ఎంట్రీ ఇచ్చే ఏఐసీసీ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్ స్వల్పంగా ఛేంజ్ అయింది.
- By CS Rao Published Date - 12:27 PM, Tue - 4 October 22
భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంణాలోకి ఎంట్రీ ఇచ్చే ఏఐసీసీ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్ స్వల్పంగా ఛేంజ్ అయింది. తర్జభర్జనల తరువాత రూట్ మ్యాప్ ను మంగళవారం ఫైనల్ చేశారు. తెలంగాణలో మొత్తం 13 రోజులకే కుదించిన రాహుల్ పాదయాత్రలో 359 కిలోమీటర్లు నడవనున్నారు. తాజా రూట్ మ్యాప్ ను టీపీసీసీ ప్రకటించింది. దాని ప్రకారం నియోజకవర్గాల వారీగా రాహుల్ పాదయాత్ర ఇలా ఉంది.
*మక్తల్ నియోజకవర్గం లోని కృష్ణా మండలం, కృష్ణా గ్రామం వద్ద తెలంగాణలోకి ఎంట్రీ కానున్న భారత్ జోడో యాత్ర తొలి రోజు మక్తల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉంటుంది. రాహుల్ పాదయాత్ర లో కొడంగల్, నారాయణ పేట, గద్వాల్, అలంపూర్ నియోజకవర్గ నేతలతోపాటు రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొంటారు.
2వ రోజు..
దేవరకద్ర నియోజకవర్గంలో కల్వకుర్తి, దేవరకొండ, వనపర్తి, అచ్చంపేట సెగ్మెంట్ నేతలు
3వ రోజు..
మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ రాహుల్ పాదయాత్రలో తాండూర్, పరిగి, దేవరకొండ మినహా నల్గొండ పార్లమెంట్ లోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలు పాల్గొంటారు.
4వ రోజు..
జడ్చర్ల అసెంబ్లీ సెగ్మెంట్లో రాహుల్ పాదయాత్ర..
నాగర్ కర్నూల్ ఖమ్మం లోక్ సభలోని అసెంబ్లీ నియోజకవర్గ నేతలు పాల్గొంటారు.
5వ రోజు..
షాద్ నగర్ నియోజకవర్గంలో రాహుల్ పాదయాత్ర..
మహేశ్వరం అసెంబ్లీ తోపాటు భువనగిరి లోక్ సభ లోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలు పాల్గొంటారు.
6వ రోజు..
శంషా బాద్ ప్రాంతంలో జరిగే యాత్రలో హైదరాబాద్ లోక్ సభలోని అసెంబ్లీ సెగ్మెంట్లతోపాటు రాజేంద్రనగర్, ఎల్బీ నగర్, ఉప్పల్ నియోజకవర్గ నేతలు.
7వరోజు..
శేరిలింగంపల్లి నియోజకవర్గం రాహుల్ పాదయాత్ర..
ఈ పాదయాత్రలో చేవెళ్ల లోక్ సభలోని మహేశ్వరం, రాజేంద్ర నగర్ మినహా మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లు, సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నేతలు పాల్గొంటారు.
8వ రోజు..
బీహెచ్ఈఎల్ ప్రాంతంలో రాహుల్ పాదయాత్ర సాగనుంది.
ఈ యాత్రలో మల్కాజ్ గిరి, మహబూబా బాద్ పార్లమెంట్ పరిధిలోని నేతలు పాల్గొంటారు.
9వ రోజు..
సంగారెడ్డి లో కొనసాగనున్న రాహుల్ యాత్ర..
మెదక్, వరంగల్ లోక్ సభ పరిధిలోని నేతలు పాల్గొంటారు.
10వ రోజు..
జోగి పేట లో కొనసాగనున్న రాహుల్ యాత్ర..
ఈ యాత్రలో జహీరాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని నేతలు పాల్గొంటారు.
11వ రోజు..
శంకరం పేట ప్రాంతంలో రాహుల్ పాదయాత్ర..
ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలు పాల్గొంటారు.
12 వ రోజు..
జుక్కల్ ప్రాంతాల్లో సాగనున్న రాహుల్ యాత్ర.. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలు హాజరు.
13వ రోజు..
జుక్కల్ లోనే సాగనున్న యాత్ర..
కరీంనగర్ లోక్ సభ లోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలతోపాటు రాష్ట్ర వ్యాప్త ముఖ్య నేతలు పాల్గొంటారు.
◻️ 13వ రోజు సాయంత్రం తో తెలంగాణలో ముగియనున్న రాహుల్ పాదయాత్ర
Related News
Shushrutha Gowda : రాహుల్గాంధీతో దేశవ్యాప్తంగా పర్యటించిన నేత.. బీజేపీలోకి జంప్ !
Shushrutha Gowda : ఆయన కాంగ్రెస్ కీలక నేత. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్రలో ఆయన పాల్గొన్నారు.