Road Accident : నల్గొండ జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అనేవి నిత్యం అనేకం జరుగుతుంటాయి
- By Sudheer Published Date - 10:26 AM, Sat - 25 November 23
నల్గొండ (Nalgonda) జిల్లాలో ఘోర ప్రైవేట్ బస్సు ప్రమాదం (Private Bus Accident) చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు చింతపల్లి (Chinthapalli) శివారులో బోల్తా పడింది. ఈ ఘటన లో ఒకరు మృతి చెందగా..పది మందికి పైగా గాయాలపాలయ్యారు. గుంటూరు జిల్లా వినుకొండలోని పెళ్లికి హాజరైన ఓ బృందం.. హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో చింతపల్లి సాయిబాబా గుడి సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా..పదిమందికిపైగా గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు అంబులెన్సు కు ఫోన్ చేయడం తో ఘటన స్థలానికి చేరుకొని స్థానిక హాస్పటల్స్ కు తరలించారు. పోలీసులు సైతం చేరుకొని ఘటన ఎలా జరిగిందనేదానిపై దర్యాప్తు చేపట్టారు.
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అనేవి నిత్యం అనేకం జరుగుతుంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ – విజయవాడ రూట్లలో ఎక్కువ. అతివేగం , మద్యం మత్తు , నిద్ర మత్తు లో డ్రైవింగ్ చేస్తుండడం వల్ల ఈ రూట్లలో ప్రమాదాలు ఎక్కువ సంఖ్యలో జరుగుతుంటాయి.
Read Also : IT Raids : హైదరాబాద్లో మళ్లీ ఐటీ రైడ్స్.. ఈసారి టార్గెట్ ఎవరంటే ?
Related News
Jagadish Reddy: కోమటిరెడ్డిపై జగదీశ్ రెడ్డి ఫైర్.. చెత్త మాటలంటూ ఘాటుగా రియాక్షన్
Jagadish Reddy: తనపై కోమటిరెడ్డి చేసిన ఆరోపణలను చెత్తవంటూ మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొట్టిపారేశారు. ఆయన మాటలు ప్రజలకు ఏ రూపంలో కుడా ఉపయోగపడ జాలవని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్ సోమాజిగూడా లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీ ట్ ది ప్రెస్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాజ