CM Revanth Reddy : ముగిసిన విద్యుత్, ఆర్టీసీపై సీఎం రేవంత్ సమీక్ష
- Author : Sudheer
Date : 08-12-2023 - 3:23 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ సీఎం గా బాధ్యతలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన దూకుడు కనపరుస్తున్నారు. అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లే ..మొదటి సంతకం కూడా ఆరు గ్యారెంటీల ఫై పెట్టి..వాటిని అమలు చేసే పనిలో పడ్డారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈరోజు సచివాలయంలో విద్యుత్ (Electricity and RTC), ఆర్టీసీపై సీఎం రేవంత్ సమీక్షా చేపట్టారు. ఈ సమావేశంలో అధికారులు విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, కొనుగోలుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 2014 జూన్ 2 కంటే ముందు పరిస్థితులు, తర్వాత విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు, ప్రస్తుత పరిస్థితులపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఇక సీఎండీ ప్రభాకర్ రావు గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. విద్యుత్, ఆర్టీసీ పై అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి రివ్యూ చేస్తానని తెలిపారు. ప్రస్తుతం రేవంత్ ఢిల్లీకి బయలుదేరుతున్నారు. మంత్రుల శాఖలు , మిగతా మంత్రుల పదవులపై అధిష్టానం తో చర్చించనున్నారు.
Read Also : Rs 100 Crore : కాంగ్రెస్ ఎంపీ నివాసాల్లో రూ.100 కోట్లు లభ్యం