CM Revanth : రేవంత్ 39 సార్లు ఢిల్లీకి వెళ్లిన రాష్ట్రానికి ఒక్క రూపాయి తేలేదు – కేటీఆర్
CM Revanth : "ఓటేసి మోసపోయామని ప్రజలు ఫిర్యాదులు చేస్తుంటే, నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే, సీఎం మాత్రం ఢిల్లీ చక్కర్లు కొడుతున్నారు"
- By Sudheer Published Date - 06:53 PM, Fri - 14 March 25

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ ఇప్పటివరకు 39 సార్లు ఢిల్లీకి వెళ్లి సెల్ఫ్ప్రేమతో మీడియా ముందు ప్రచారం చేసుకున్నప్పటికీ, రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా రాబట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. “ఓటేసి మోసపోయామని ప్రజలు ఫిర్యాదులు చేస్తుంటే, నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే, సీఎం మాత్రం ఢిల్లీ చక్కర్లు కొడుతున్నారు” అంటూ కేటీఆర్ తన ట్వీట్లో వ్యాఖ్యానించారు.
Group 3 results : తెలంగాణ గ్రూప్ -3 ఫలితాలు విడుదల
రాష్ట్రంలోని సాగునీటి సమస్యలు, రైతుల కష్టాలు, ప్రభుత్వ హామీల అమలుపై రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఆయన విమర్శించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యి 14 నెలలు గడిచినా వాగ్దానాలు అమలుకు నోచుకోలేదని, నిధుల కోసం ఢిల్లీకి వెళ్తున్నప్పటికీ ఏ ఫలితమూ లేకపోవడం దారుణమని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి హామీలు నిలబెట్టుకోవాలంటే మాటలు కాకుండా కార్యాచరణ ఉండాలని సూచించారు.
“జాగో తెలంగాణ జాగో” అంటూ ట్వీట్ చేసిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజలు అప్రసన్నత వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు పంట సాగు కోసం తగినన్ని నీటిని అందించలేకపోవడం, రుణమాఫీ, కొత్త ఉపాధి అవకాశాలపై స్పష్టత ఇవ్వకపోవడం, కేంద్రం నుంచి రాష్ట్రానికి అనుసంధానమైన నిధులు తీసుకురావడంలో విఫలమవుతున్న ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన హితవు పలికారు.
గల్లీలో హోదాను మరిచి తిట్లు – ఢిల్లీలో చిట్ చాట్లు.
కాలు గడప దాటదు కానీ .. ఢిల్లీలో మాటలు కోటలు దాటుతున్నాయి.
నీళ్లు లేక పంటలు ఎండి- పొలాలు బీడువారి అన్నదాతలు అరిగోస పడుతుంటే .. కనీసం సాగునీళ్లపై సమీక్ష లేకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్.
39 సార్లు ఢిల్లీ పోయి మీడియా…
— KTR (@KTRBRS) March 14, 2025