HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Uttam Dont Know The Value Of Water Harish

Value of Water : రేవంత్, ఉత్తమ్ కు నీళ్ల విలువ తెలియదు – హరీశ్

Value of Water : రాష్ట్రంలోని అన్నపూర్ణ, కొండపోచమ్మ, బస్వాపూర్ వంటి కీలక రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయని, కృష్ణా, గోదావరి జలాలను సముద్రంలోకి వదులుతున్నారని ఆయన మండిపడ్డారు.

  • By Sudheer Published Date - 06:40 PM, Sun - 17 August 25
  • daily-hunt
Harishrao Water
Harishrao Water

తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harishrao) ఆరోపించారు. రాష్ట్రంలోని అన్నపూర్ణ, కొండపోచమ్మ, బస్వాపూర్ వంటి కీలక రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయని, కృష్ణా, గోదావరి జలాలను సముద్రంలోకి వదులుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇది ప్రభుత్వ క్రిమినల్ నిర్లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు నీళ్ల విలువ తెలియదని దుయ్యబట్టారు. రాజకీయాల కోసం రైతులను బలి చేయవద్దని ఆయన హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ వాటికి నష్టం కలిగిస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. ఇలా చేస్తే మోటార్లు పాడైపోతాయని, వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని బీహెచ్ఈఎల్ కూడా హెచ్చరించిందని ఆయన పేర్కొన్నారు. మోటార్లు దెబ్బతింటే దానిని బీఆర్ఎస్ పార్టీపై నెట్టాలని కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ఆయన అన్నారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం పాడుపెట్టిందని, ఇప్పటికైనా బురద రాజకీయాలు మానేసి వరద నీటిని ఒడిసి పట్టాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

Surrogacy Case : మేడ్చల్ సరోగసీ కేసులో విస్తుపోయే నిజాలు

రైతు ప్రయోజనాల కంటే ప్రభుత్వానికి రాజకీయాలే ముఖ్యమని హరీశ్‌రావు విమర్శించారు. కమీషన్లకు, వాటాలకు సమయం సరిపోతోందని, ప్రాజెక్టుల నిర్వహణపై శ్రద్ధ పెట్టడం లేదని ఆరోపించారు. నంది మేడారంలో స్విచ్ ఆన్ చేస్తే రోజుకు రెండు టీఎంసీల నీరు మిడ్ మానేరులోకి వస్తుందని, ఈ విషయాన్ని వారం క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ ద్వారా తెలియజేశానని హరీశ్‌రావు తెలిపారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు ఎల్లంపల్లి గేట్లు తెరిచి నీళ్లను సముద్రంలోకి వదులుతున్నారని ఆయన మండిపడ్డారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం చేసే రైతు కాబట్టి ప్రతి నీటి చుక్కనూ ఒడిసి పట్టి రైతులకు అందించారని హరీశ్‌రావు అన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు వ్యవసాయం చేయలేదు కాబట్టి వారికి నేల విలువ తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి వచ్చే నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నా కూడా కళ్లప్పగించి చూడడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • Congress Govt
  • harish rao
  • Kaleshwaram water
  • Value of Water

Related News

L&thyd

L&T : L&T వెళ్లిపోవడానికి కారణం రేవంత్ రెడ్డినే – కేటీఆర్

L&T : శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్(Shamshabad Airport) వరకు మెట్రోను కొనసాగించాలని నిర్మాణ బాధ్యతలు తీసుకున్న L&T సంస్థ కోరినా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ ప్రతిపాదనను తిరస్కరించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు

  • Kcr Metting

    KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

  • Bathukamma Kunta Lake

    Bathukamma Kunta : నేడు బతుకమ్మ కుంటను ప్రారంభించనున్న సీఎం

  • Group-1 Candidates

    BC Reservation : సీఎం రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయాలు ఎంతో గొప్పవి !!

  • Third Degree Assault On Tri

    Urea : యూరియా అడిగినందుకు గిరిజన యువకుడిపై థర్డ్ డిగ్రీ – హరీశ్ రావు

Latest News

  • Dasara : మందుబాబులకు ముందే హెచ్చరిక జారీ చేసిన వైన్స్ షాప్స్

  • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

  • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

  • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd