Prashant Kishor : కాంగ్రెస్ కు ప్రశాంత్ కిషోర్ షేక్ హ్యాండ్? మరప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు ఇప్పుడు తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపిస్తోంది. పీకేతో ఒప్పందం కుదుర్చుకోవడానికి కాని, లేదా ఆయనను పార్టీలో చేర్చుకుని ఎన్నికల వ్యూహాలను అమలు చేయడానికి కాని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఆలోచిస్తోంది.
- By Hashtag U Published Date - 12:07 PM, Tue - 19 April 22
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు ఇప్పుడు తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపిస్తోంది. పీకేతో ఒప్పందం కుదుర్చుకోవడానికి కాని, లేదా ఆయనను పార్టీలో చేర్చుకుని ఎన్నికల వ్యూహాలను అమలు చేయడానికి కాని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఆలోచిస్తోంది. ఇంతవరకు ఓకే. ఒకవేళ కాంగ్రెస్ తో కాని పీకేకు లంకె కుదిరితే.. తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ టీఆర్ఎస్ పీకే సేవలను ఉపయోగించుకుంటోంది.
కాంగ్రెస్ పార్టీ దేశమంతా పీకే సేవలను ఉపయోగించుకుంటే.. ఆటోమేటిగ్గా తెలంగాణలో కూడా ఆయన సేవలు హస్తానికి అందుతాయి. అయితే ఇప్పటికే ఇక్కడ టీఆర్ఎస్ కు ఆయన సేవలు అందిస్తున్నారు. మరప్పుడు ఆయన గులాబీ పార్టీకి సేవలు ఆపేస్తారా? అదే జరిగితే టీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవా? పీకే వాదన చూస్తే.. జాతీయస్థాయిలో మాత్రమే కాంగ్రెస్ విజయానికి వ్యూహాలు తయారుచేస్తానని.. రాష్ట్ర స్థాయి ఎన్నికల విషయంలో తన సేవలు హస్తానికి అందించనని చెప్పారు. కానీ తాజా పరిణామాలు చూస్తే మాత్రం.. కాంగ్రెస్ పార్టీ పీకే సర్వీసును అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు కలిపి వినియోగించుకోవాలని భావిస్తోంది. దీంతో టీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
మరో వాదన ప్రకారం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గూటికి టీఆర్ఎస్ ను చేర్చాలని పీకే ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనివల్ల ఇక్కడ అందించే సేవల విషయంలో ఆయనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పరంగా గట్టి బంధం ఉంటుంది కనుక ఈజీగా ఎక్కువ సీట్లను సొంతం చేసుకోవచ్చన్నది పీకే ప్లాన్. కానీ ఇప్పటికే టీఆర్ఎస్, టీపీసీసీలు ఉప్పు-నిప్పులా ఉన్నాయి. అలాంటప్పుడు వీటి మధ్య పొత్తు సాధ్యమా?
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటారు. ఒకవేళ కాంగ్రెస్ తో పీకే జట్టు కడితే.. అది హస్తానికి బూస్ట్ ఇచ్చినట్టే. దేశమంతా దాని పరిస్థితి ఎలా ఉన్నా… తెలంగాణలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ కు ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు తన సేవలు అందిస్తు్న్నారు. పైగా ఆయన వ్యూహాలు కూడా పనిచేస్తున్నాయని పార్టీలో టాక్ ఉంది. అందుకే డిజిటల్ సభ్యత్వాలు 40 లక్షలు దాటాయని అంటోంది. సునీల్ కనుగోలు కూడా పీకేకు శిష్యుడే. ఒకవేళ పీకేతో ఒప్పందం కుదిరితే.. సునీల్ కనుగోలు విషయాన్ని టీపీసీసీ ఏం చేస్తుందో చూడాలి.
Related News
Sonia Gandhi : ప్రతి పేద మహిళకు రూ.1లక్ష లభిస్తాయి.. సోనియా గాంధీ
Sonia Gandhi: కాంగ్రెస్ మ్యానిఫెస్టో(Congress Manifesto)లో పేర్కొన గ్యారంటీలపై కాంగ్రెస్(Congress)పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) మాట్లాడుతూ..తమ మ్యానిఫెస్టోలో తెలిపిన గ్యారంటీలతో దేశంలో మహిళల స్థితిగతులు పూర్తిగా మారిపోతాయని అన్నారు. దేశంలో నెలకొన్న తీవ్ర సంక్షోభం వల్ల మహిళలు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారని సోమవారం విడుదల చేసిన వీడియో సందేశంలో అన్నారు. అలాంటి వారందరికీ