Hyderabad Voters: బద్ధకించిన హైదరాబాద్ ఓటర్స్.. 50 లక్షల మంది నో ఓటింగ్!
50 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదని రాష్ట్ర ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు.
- By Balu J Published Date - 03:03 PM, Fri - 1 December 23
Hyderabad Voters: భారత ఎన్నికల సంఘం (ECI) డేటా ప్రకారం GHMC పరిమితుల్లో సాయంత్రం 5 గంటల సమయానికి పోలింగ్ శాతం కేవలం 48.7 శాతం మాత్రమే. కొన్ని పోలింగ్ కేంద్రాలు మూసివేసే సమయానికి 30 నిమిషాల ముందు సాయంత్రం 4.30 గంటలకు కూడా జనం ఇల్లు దాటి బయటకు రాలేదు. పాతబస్తీలోని యాకుత్పురాలో కేవలం 25 శాతం మాత్రమే ఓటర్లు హాజరుకాగా, ఐటీ కారిడార్లో ఎక్కువ భాగం ఉన్న శేరిలింగంపల్లిలో 48.60 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో దాదాపు 50 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదని రాష్ట్ర ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు.
జూబ్లీహిల్స్లోని గౌతమ్ మోడల్ స్కూల్, మాదాపూర్లోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, కమలాపురి కాలనీలోని రిచ్మండ్స్ హైస్కూల్ (జూబ్లీహిల్స్), మలక్పేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మాదాపూర్లోని ఆస్తిపన్ను వసూళ్ల కౌంటర్, ఎస్ఆర్లోని నారాయణ జూనియర్ కళాశాలలో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే సాయంత్రం 4 గంటల తర్వాత కూడా పోలింగ్ కేంద్రాలు నిర్మానుష్యంగా ఉన్నాయి.
అత్యల్పంగా యాకుత్పురా (27.87 శాతం), నాంపల్లి (32.4 శాతం), చాంద్రాయణగుట్ట (39 శాతం)లో అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది. యాకుత్పురాలో చాలామంది ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదని, నాంపల్లిలో చాలా డూప్లికేట్ ఎంట్రీలు ఉన్నాయని తెలిపారు.
అత్యధికంగా పటాన్చెరులో (69.72 శాతం), మహేశ్వరంలో (53.14 శాతం), కుత్బుల్లాపూర్లో (52.80 శాతం) పోలింగ్ శాతం నమోదైంది. కాగా, హైదరాబాద్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 4.85% మాత్రమే నమోదైన పోలింగ్ శాతం 47.14% వద్ద ముగిసింది.
Related News
Rains Alert: చల్లని కబురు.. తెలంగాణలోని 14 జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 29న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.