TRS MLA’s Case: దయచేసి ఆ నలుగురు కనిపిస్తే చెప్పండి…!!
ఆ నలుగురు అనేసరికి... ఎవరో అనుకోవద్దు. వారే మొయినాబాద్ ఫాం హౌజ్ ఎమ్మెల్యేలు. మునుగోడు ఉపఎన్నిక కంటే ముందు ఈ సీన్ చాలా ఫేమస్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది ఈ ఘటన.
- By hashtagu Published Date - 10:16 AM, Sat - 12 November 22
ఆ నలుగురు అనేసరికి… ఎవరో అనుకోవద్దు. వారే మొయినాబాద్ ఫాం హౌజ్ ఎమ్మెల్యేలు. మునుగోడు ఉపఎన్నిక కంటే ముందు ఈ సీన్ చాలా ఫేమస్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది ఈ ఘటన. చాలా పకడ్బందీగా ఈ కథను నడిపించారు. వీరిని బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందంటూ సాక్షత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత మునుగోడులో కారు దూసుకెళ్లింది. గులాబీ జెండా ఎగురవేసింది. ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బహిరంగంగానే ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి. కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీ, బీజేపీ దాని అనుబంధ సంస్థల దుమ్ము దులిపారు. ఈ దేశం ఎటు పోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్. మనం ఇలాగే ఉంటే దేశాన్ని అమ్మేస్తారంటూ మండిపడ్డారు. ఈ సమయంలోనే తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ ఆరోపణలు చేశారు కేసీఆర్.
Also Read: PM MODI : నేడు తెలంగాణలో పర్యటించనున్న మోదీ, డుమ్మా కొట్టనున్న కేసీఆర్…!!
అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండిసంజయ్ మండిపడ్డారు. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అంతా కూడా ప్రగతిభవన్ వేదికగా జరిగిన స్క్రిప్ట్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇక కిషన్ రెడ్డి అయితే డైరెక్ట్ గానే కొంటాం…మధ్య వర్తులతో మాకేంటి పని అంటూ ప్రకటించారు.
ఈ వ్యవహారం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఓ వైపు లిక్కర్ వ్యవహారం, మరో వైపు గ్రానైట్ హవాలా దందా…ఎమ్మెల్యేల ఫామ్ హౌజ్ కేసుతో జనం మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మొయినాబాద్ ఫాంహౌజ్ నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. వందకోట్లుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ ప్రయత్నించింది. అయితే ఆ నలుగురు ఎమ్మెల్యేలకు అంత ఉందా అంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఉపఎన్నిక తర్వాత ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎక్కడికి పోయారు. ఎందుకు గాయబ్ అయ్యారు. ప్రజల్లో ఉండాల్సిన ప్రతినిధులు ఎక్కడికి వెళ్లినట్లు. ఆ ఎమ్మెల్యేల కోసం ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. దయచేసి మా ఎమ్మెల్యేల ఎక్కడ ఉన్నారో కాస్త చెప్పండి ప్లీజ్ అంటూ కోరుతున్నారు.
Also Read: HYD Traffic : మోదీ పర్యటన నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు..!!
Related News
Lok Poll : లోక్ సభ ఎన్నికల్లో బిజెపి 12 స్థానాల్లో విజయం సాదించబోతుంది – ఈటెల
కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని..కానీ వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుండి వ్యతిరేకత మూటకట్టుకుందని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు