Telangana
-
తెలంగాణపై ధర్మల్ పొగ..కాలుష్య రాష్ట్రాల్లో రెండో స్థానం
బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల నుంచి కాలుష్యం భారీ వెలువడుతుంది. అందుకు తగిన ప్రమాణాలను పాటించకపోతే..పర్యావరణం నాశనం అవుతుంది. అందుకే ఎప్పటికప్పుడు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది.
Date : 01-10-2021 - 3:30 IST -
పేదలకు బ్రాండ్ అంబాసిడర్ ఉంటా.. కేసీఆర్ ను గద్దెదింపుతా!
తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల భూమి నోచుకోని దళితులకు.. డబుల్ బెడ్ ఇళ్లు అందని అర్హులైన పేదలకు.. సీఎం పదవికి నోచుకోని దళితులకు అండగా ఉంటానని, అవసరమైతే వాళ్లందరి పక్షాన బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ 32వ రోజు సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
Date : 01-10-2021 - 3:28 IST -
దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.97 శాతం
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు దేశ జీడీపీ తెలంగాణ వాటా 4.06గా ఉంటే, ప్రస్తుతం 4.97 శాతం పెరిగిందని, ఫలితంగా దేశంలోనే తెలంగాణ అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసిందని మంత్రి హరీశ్ రావు అన్నారు.
Date : 01-10-2021 - 1:26 IST -
ముంచుకొస్తున్న మూడో వేవ్..తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం
రాష్ట్రంలో మూడవ కోవిడ్ వేవ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైద్యపరమైన అవసరాలను తీర్చడానికి పూర్తిగా సన్నద్ధమైంది. కోవిడ్ మొదటి, రెండో వేవ్ లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న టీఎస్ గవర్నమెంట్.. ఇప్పుడు అన్నిరకాలుగా మూడో వేవ్ ను ఎదుర్కోవడానికి సిద్ధమయింది.
Date : 30-09-2021 - 3:48 IST -
హుజూరాబాద్ పీఠం దక్కేది ఎవరికో.. అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకమే!
హుజూరాబాద్ ఉప ఎన్నికను పరిశీలిస్తే.. సాధారణ ఎన్నికలు అప్పుడే వచ్చాయా అన్నట్టు ఉంది కదా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బె చెప్పడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉప ఎన్నిక అని పార్టీలకు సవాల్ ప్రతిష్టాత్మకంగా మారింది. కేంద్రంలో ఉన్న బీజేపీకి, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ కు, ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు... ఇలా ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది. హ
Date : 30-09-2021 - 3:24 IST -
పెట్టుబడుల స్వర్గధామం తెలంగాణ.. జహీరాబాద్ లో మహీంద్ర కే2 ట్రాక్టర్ల కంపెనీ
పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు తెలంగాణ వైపు చూస్తున్నారు. ఆ విషయాన్ని మహీంద్ర కంపెనీ ఎండీ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ప్రపంచంలో పెట్టుబడులకు తెలంగాణ మంచి కేంద్రమని ట్వీట్ చేశారు
Date : 30-09-2021 - 3:04 IST -
2031 నాటికి వరదల్లో హైదరాబాద్..స్కాలర్ స్వాతి చెప్పిన ప్రత్యామ్నాయ మార్గాలలు ఇవే
అసాధారణ వర్షపాతం కారణంగా హైద్రాబాద్ 2031 నాటికి మునిగిపోతుందా? ఇప్పుడున్న వరద నీటి ప్రవాహం నెట్ వర్క్, మూసి నదిని ప్రక్షాళన చేయకపోతే..వరద ముప్పు భాగ్యనగరానికి తప్పదని హైద్రాబాద్ బిట్స్ పిలానీ స్కాలర్ వేముల స్వాతి అధ్యయనం చెబుతోంది.
Date : 30-09-2021 - 2:59 IST -
జల వలయంలో మారుమూల గ్రామం.. బాలుడి ప్రాణాలు కాపాడిన డ్రోన్
మనుషుల అవసరాలు పెరుగుతున్నాయి.. దాంతో పాటే టెక్నాలజీ వాడకం పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం డ్రోన్స్ ను అందుబాటులోకి తీసుకురావడంతో.. మారుమూల పల్లెల్లోనూ డ్రోన్స్ ప్రత్యక్షమవుతున్నాయి. భారీ వర్షానికి చిక్కుకున్న ఓ గ్రామానికి కావాల్సిన మందులను పంపి, బాలుడి ప్రాణాలను కాపాడారు.
Date : 30-09-2021 - 1:17 IST -
తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకం : మంత్రి కేటీఆర్
ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలకు రిజర్వేషన్లు ఉండవని, ప్రభుత్వ ఉద్యోగాలకు కేవలం రెండు శాతం రిజర్వేషన్లు మాత్రమే ఉంటాయన్నారు.
Date : 29-09-2021 - 4:52 IST -
దూసుకుపోతున్న టీఆర్ఎస్, బీజేపీ.. అభ్యర్థి వేటలో కాంగ్రెస్..!
హుజూరాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీలు ప్రచార పర్వంలో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ మాత్రం ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Date : 29-09-2021 - 2:13 IST -
హుజూరాబాద్ ఉప పోరుకు సై.. అక్టోబర్ 30 ఎన్నికల, నవంబర్ 2న ఫలితం
ఏపీ, తెలంగాణలో ఉప ఎన్నికల పోరుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ అక్టోబర్ ఒకటో తేదీన వెలువడనుంది.
Date : 28-09-2021 - 2:24 IST -
కేసీఆర్ సారూ.. వీటికి జవాబు చెప్పండి..
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు పది ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Date : 28-09-2021 - 1:21 IST -
తెలంగాణకు గులాబ్ గుబులు.. వాయుగుండ ప్రభావంతో నేడూ అలర్ట్
ఆకాశం చిల్లులు పడిందా అన్నట్టు.. వరుణుడు విరుచుకుపడ్డాడు. ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురవడంతో తెలంగాణలోని పల్లెలు, పట్టణాలు వణికిపోయాయి.
Date : 28-09-2021 - 12:38 IST -
రేవంత్ దూకుడు.. టీఆర్ఎస్ కు ముచ్చెమటలు..!
ఎక్కడైతే సమర్థవంతమైన నాయకత్వం ఉంటుందో, అక్కడ మాత్రమే విజయం ఉంటుంది. ఈ మాటలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అతికినట్టుగా సరిపోతాయి.
Date : 27-09-2021 - 4:39 IST -
భారత్ బంద్ పై మాటల యుద్ధం.. రేవంత్ వర్సెస్ సుధాకర్ రెడ్డి
భారత్ బంద్ పై రాజకీయ నేతల మాటల యుద్ధం మొదలైంది. ఈనెల 27న విపక్షాలు భారత్ బంద్ కు పిలుపు ఇచ్చిన విషయం విదితమే. ఆ రోజున దేశ వ్యాప్తంగా పెరిగిన ధరలు, పబ్లిక్ కంపెనీల అమ్మకాలు, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా విపక్ష నేతలు నినదించబోతున్నారు.
Date : 24-09-2021 - 2:32 IST -
సెంట్రల్ ఢిల్లీలో ఫైట్ .. హిందూసేన వర్సెస్ ఎంఐఎం
సెంట్రల్ ఢిల్లీ..పైగా అశోక్ రోడ్డుకు ఇరువైపులా దేశంలోని అత్యున్నత పదవుల్లో ఉన్న ప్రముఖులు నివసిస్తుంటారు. అక్కడే ప్రధాని, ఎన్నికల కమిషనర్, పోలీస్ కమిషనరేట్..ఇలా అన్నీ ఉంటాయి. భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. ఆ రోడ్డులోనే ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ నివాసం.
Date : 22-09-2021 - 2:28 IST -
రేవంత్ రైట్ ఛాలెంజ్..రాహుల్ అండదండలు భేష్
టైం బాగుంటే అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయనడంలో సందేహం లేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహణ రేవంత్ ఇంటిపై దాడిని తీసుకోవచ్చు. ఆ దాడి కారణంగా హైద్రాబాద్ నుంచి ఢిల్లీ వరకు వైట్ ఛాలెంజ్ వెళ్లింది.
Date : 22-09-2021 - 2:26 IST -
కోమాలోకి వెళ్లిన డ్రగ్స్ కేసు.. సినీ హీరోలు,నటులు, డైరెక్టర్లకు క్లీన్ చిట్
డ్రగ్స్ కేసు వెనుక ఏం జరిగింది? నాలుగేళ్ల తరువాత సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇవ్వడంలో మతలబు ఏంటి? ఈడీ విచారణ జరుగుతున్న సమయంలోనే క్లీన్ చిట్ ఇవ్వడం దేనికి సంకేతం? సినీ హీరోలు, నటులకు విచారణ రూపంలో జరిగిన డామేజ్ ను ఎవరు తిరిగి ఇస్తారు? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి.
Date : 21-09-2021 - 3:40 IST -
వైఎస్ తరహాలో షర్మిల పాదయాత్ర.. చేవెళ్ల నుంచి అక్టోబర్ 20న శ్రీకారం
రాజన్న రాజ్యం కోసం షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. అక్టోబర్ 20వ తేదీ నుంచి పాదయాత్రను ప్రారంభించడానికి సిద్ధం అయ్యారు. చేవెళ్ల నుంచి ప్రారంభించి మళ్లీ అక్కడే పాదయాత్రను ముగించేలా బ్లూ ప్రింట్ ను రూపకల్పన చేశారు.
Date : 21-09-2021 - 3:31 IST -
దుబాయ్ ఆస్పత్రి దయాగుణం.. తెలంగాణ రోగికి రూ. 3.4కోట్ల బిల్లు రద్దు
తెలంగాణలోని ఆస్పత్రులు రోగులను ఎలా పీల్చి పిప్పి చేస్తారో అందరికీ అనుభవమే. కరోనా సమయంలో లక్షలకు లక్షలు బిల్లు వేసి సామాన్యులను పీక్కుతిన్నారు. రోగుల పట్ల కరుణ, దయ చూపిన హాస్పటల్ ఒక్కటి కూడా లేదు. అదేమని ప్రభుత్వం ప్రశ్నించిన దాఖలాలు లేవు.
Date : 21-09-2021 - 3:20 IST