HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >I Am The Brand Ambassador Of The Poor Bjp Chief Bandi Comments

పేదలకు బ్రాండ్ అంబాసిడర్ ఉంటా.. కేసీఆర్ ను గద్దెదింపుతా!

తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల భూమి నోచుకోని దళితులకు.. డబుల్ బెడ్ ఇళ్లు అందని అర్హులైన పేదలకు.. సీఎం పదవికి నోచుకోని దళితులకు అండగా ఉంటానని, అవసరమైతే వాళ్లందరి పక్షాన బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ 32వ రోజు సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

  • By Balu J Published Date - 03:28 PM, Fri - 1 October 21
  • daily-hunt

తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల భూమి నోచుకోని దళితులకు.. డబుల్ బెడ్ ఇళ్లు అందని అర్హులైన పేదలకు.. సీఎం పదవికి నోచుకోని దళితులకు అండగా ఉంటానని, అవసరమైతే వాళ్లందరి పక్షాన బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ 32వ రోజు సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

గత ఏడేళ్లలో వర్షాల కారణంగా వేలాది మంది రైతులు ఆర్థికంగా నష్టపోయారని, కేసీఆర్ ప్రభుత్వం ఏ ఒక్క రైతుకూ పరిహారం చెలించలేదని ఆరోపించారు. అనేక సమస్యలతో కొట్టామిట్టాడుతున్న రైతాంగానికి కేంద్రం అవసరమైన సాయం చేసిందని, కేవలం రైతుల కోసమే మోడీ ప్రభుత్వం ‘ఫసల్ భీమా యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టిందని బండి సంజయ్ గుర్తు చేశారు. నేటికీ రుణమాఫీ కాని రైతుల కోసం, సీఎం పదవిని పొందలేని దళితుల పక్షాన నిలబడుతానని బండి వ్యాఖ్యానించారు.

తెలంగాణ రైతుల నుంచి బియ్యం కొనుగోలు చేయడానికి కేంద్రం నిరాకరించిందని  టీఆర్ఎస్ ప్రభుత్వం అసత్యాలను ప్రచారం చేస్తోందని.. ఒకవేళ కేంద్రం ప్రభుత్వం నిరాకరిస్తే కేసీఆర్ రుజువు చేయాలని డిమాండ్ చేశారు. వేలాది మంది విద్యార్థుల పోరాటంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులు, రైతులు, యువతను నిట్టనిలువునా మోసం చేసిందని విమర్శించారు. ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ వెంట బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాజ్ కుమార్ చాహర్, సీనియర్ నాయకులు ఎస్. బాబు రావు, మనోహర్ రెడ్డి, జి ప్రేమందర్ రెడ్డి,  రాకేష్ రెడ్డి, ఎన్ వి సుభాష్ ఉన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Latest News

Related News

    Latest News

    • Vice President Elections : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి విజయం

    • Telugu Pride & Bharat First : ‘తెలుగు ఆత్మగౌరవమే’ టీడీపీ సిద్ధాంతం – నారా లోకేష్

    • TDP’s Long-Term Alliance with NDA : 2029 తర్వాత కూడా టీడీపీ ఎన్డీఏతోనే..స్పష్టం చేసిన నారా లోకేష్

    • Skill Census vs Caste Census : కుల గణన పై చంద్రబాబు ఆలోచనను బయటపెట్టిన లోకేష్

    • National Education Policy : జాతీయ విద్యా విధానంపై లోకేష్ మనుసులో మాట

    Trending News

      • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd