Owaisi: ఏం తినాలో.. ఎప్పుడు పెళ్లిచేసుకోవాలో నిర్ణయించడం హాస్యాస్పదం
మహిళల కనీస వివాహ వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదమని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.
- By Hashtag U Published Date - 12:28 AM, Sat - 18 December 21
మహిళల కనీస వివాహ వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదమని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఇతర ప్రయోజనాలకోసం చట్ట ప్రకారం మేజర్లుగా పరిగణిస్తున్న 18 సంవత్సరాలనే కనీస వివాహ వయస్సుగా పరిగణించాలని అసద్ డిమాండ్ చేశారు.
18 సంవత్సరాలు దాటినవాళ్లు ఓటుహక్కు వినియోగించుకోని ప్రధానమంత్రిని, ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంతో పాటు, కాంట్రాక్టులపై సంతకాలు, వ్యాపారాలు చేసుకొనే వెసులుబాటు ఉందికానీ అదే వయస్సులో పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉండదా అని ప్రశ్నిస్తూ అసద్ ట్వీట్ చేశారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే మహిళలు ఆర్థికంగా ఎదగడానికి అవసరమయ్యే నిర్ణయాలు తీసుకునేవాడని ఒవైసీ తెలిపారు. అభివృద్ధి చెందిన యూకే, యూఎస్ లాంటి దేశాల్లో వివాహ వయస్సు 14 కంటే తక్కువగా కూడా ఉందని అక్కడి యువత వారి తల్లితండ్రుల అనుమతితో ఆ వయస్సులో పెళ్లి చేసుకోవచ్చని ఒవైసీ గుర్తుచేశారు.
ఏం తినాలో, ఎవరిని పూజించాలో, ఎప్పుడు పెళ్లిచేసుకోవాలో ప్రభుత్వం నిర్ణయించడం హాస్యాస్పదమని, కనీస వివాహ వయస్సు విషయం కంటే యువకులకు మెరుగైన విద్య, ఆర్థిక అవకాశాలను కల్పించడం లాంటి విషయాలను ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుందని అసద్ సూచించారు. యువతను పిల్లలుగా ట్రీట్ చేయొద్దని వారికి ఆలోచించుకొని స్పేస్ ఇవ్వాలని అందుకే 20 ఏళ్ల యువకులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అవ్వడానికి అనుమతించే ప్రయివేట్ బిల్లును తాను ప్రతిపాదించానని ఓవైసి తెలిపారు.
Related News
AIMIM Chief: ఏపీ రాజకీయాలపై ఒవైసీ జోస్యం.. జగన్ కు జైకొట్టిన ఎంఐఎం చీఫ్
AIMIM Chief: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గెలిస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగిస్తారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)తో చేతులు కలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లకు ప్రజలు గుణపాఠం చెబుతారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్నికల ప్రచారం