#AskKTR: రేవంత్ ఓ క్రిమినల్ ..చర్చకు నో చెప్పిన కేటీఆర్
సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే కేటీఆర్ గురువారం అస్క్ కేటీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
- By Siddartha Kallepelly Published Date - 07:52 PM, Thu - 13 January 22
సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే కేటీఆర్ గురువారం అస్క్ కేటీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో చాలా విషయాలు చర్చకు వచ్చాయి. మొన్న కేటీఆర్ తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ రైతులపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నంత చిత్తశుద్ధి ఎవరికీ లేదని, రైతులకోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తూ రైతుల సంక్షేమానికి తమ పార్టీ మాత్రమే కట్టుబడి ఉందని కేటీఆర్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రైతులను కన్ఫుజ్ చేస్తున్నారని, రైతు సంక్షేమం కోసం టీఆర్ఎస్ చేసినదానికంటే బీజేపీ, కాంగ్రెస్ ఎక్కువగా చేసినట్టు అనిపిస్తే చర్చకు రావొచ్చని కేటీఆర్ సవాల్ విసిరారు.
కేటీఆర్ సవాలును కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ స్వీకరిస్తున్నట్లు ప్రకటించి, డేట్, ప్లేస్ చెప్పాలని కేటీఆర్ ను డిమాండ్ చేశారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ రైతులకు ఏమేం చేసిందో చెప్పడానికి తాను సిద్ధమని రేవంత్ ప్రకటించారు. కేటీఆర్ నుండి దీనికి రెస్పాన్స్ ఏమీ లేకపోయేసరికి ఒక ఇండిపెండెంట్ మీడియా సంస్థ ఈ చర్చకోసం తమ స్టూడియోకి రావాల్సిందిగా కేటీఆర్, రేవంత్ కి అప్పీల్ చేశారు.
సదరు మీడియా సంస్థ ఆహ్వానంపై తాను రావడానికి సిద్ధమని రేవంత్ ప్రకటించి గురువారం సాయంత్రం 5 గంటలకు రేవంత్ చర్చ జరిపే స్థలానికి వెళ్లారు. కేటీఆర్ మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. రైతులపై జరిగే చర్చకు వెళ్లడం లేదా అని ఒక నెటిజన్ కేటీఆర్ ను అస్క్ కేటీఆర్ కార్యక్రమంలో ఒక ప్రశ్నించగా, తాను క్రిమినల్స్ తో 420లతో చర్చలు చేయనని కేటీఆర్ ఆన్సర్ ఇచ్చారు. రేవంత్ స్టీఫెన్ సన్ తో డిబేట్ చేసుకోవచ్చని కేటీఆర్ సెటైర్ వేశారు. గతంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభినందించిన విషయంలో రేవంత్ శశిపై ఫైరయ్యారు. ఆ సమయంలో కూడా కేటీఆర్ రేవంత్ ని థర్డ్ గ్రేడ్ క్రిమినల్ అని విమర్శించారు.
I don’t debate with Criminals https://t.co/PBJlN4GPc4
— KTR (@KTRTRS) January 13, 2022
Related News
KTR: పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలపై కేటీఆర్ ధీమా.. పార్టీ నేతలకు ధన్యవాదాలు
KTR: ఈ ఎన్నికల్లో అద్భుతమైన పోరాటపటిమ ప్రదర్శించిన క్షేత్రస్థాయి భారత రాష్ట్ర సమితి శ్రేణులు అందరికీ, పార్టీ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఎదురుదెబ్బలు ఎన్ని కొట్టావు అన్నది కాకుండా ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా సవాళ్లు ఎదుర్కొనీ తిరిగి నిలబడి పోరాటం చేశామన్నదే ముఖ్యం అన్న నానుడిని నిజం చేసిన ప