HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >New Beer Brands In Telangana

Liquor తెలంగాణలో కొత్త బీర్లు..? ప్రజల ప్రాణాలతో కాంగ్రెస్ చెలగాటం – బిఆర్ఎస్

గతంలో సోమ్ డిస్టిల‌రీస్స్ కంపెనీ కారణంగా మధ్యప్రదేశ్‌లో 65 మంది చనిపోయారు. తాజాగా తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది

  • Author : Sudheer Date : 28-05-2024 - 7:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
New Beers Ts
New Beers Ts

తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు ఏ రేంజ్లో జరుగుతాయో తెలియంది కాదు..తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఎంత పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలు నడిపిస్తుందంటే దానికి లిక్కర్ అమ్మకాలు అని చెప్పొచ్చు. లిక్కర్ ద్వారా కొన్ని వందల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుండడంతో ఈరోజు రాష్ట్రాన్ని ఇంతగా అభివృద్ధి చేయడం , సంక్షేమ పథకాలు అందజేయడం చేస్తుంది. ముఖ్యంగా బీర్ల అమ్మకాలు అనేవి ఎక్కువగా జరుగుతుంటుంది. ఈసారి ఏకంగా బీర్ల కొరత ఏర్పడడం తో ప్రభుత్వం ఫై మందు బాబు విమర్శలు , KF బీర్లు అందుబాటులో ఉంచాలంటూ లేఖలు రాసిన సందర్భాలు ఏర్పడ్డాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో తెలంగాణలో కొత్త బ్రాండ్ల బీర్లు రానున్నట్లు తెలుస్తోంది. తమ కంపెనీకి చెందిన ప్రముఖ బీర్ బ్రాండ్లను తెలంగాణలో సరఫరా చేయడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సోం డిస్టిలరీస్ అనే కంపెనీ NSEకి లేఖ రాసింది. దీంతో పవర్ 10000, హంటర్ స్ట్రాంగ్, వుడ్ పెకర్, బ్లాక్ ఫోర్ట్ బీర్లు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని ప్రముఖ బ్రాండ్లు కనుమరుగై కొత్త బ్రాండ్లు వ‌చ్చే అవ‌కాశ ఉంద‌ని తెలుస్తుంది. RR టాక్స్ పేరిట ఫేమస్ లిక్కర్ బ్రాండ్లకు కమీషన్లు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేశారనే ప్రచారం జరుగుతోంది. అడిగిన మొత్తంలో కమీషన్లు ఇవ్వట్లేదని ఫేమస్ కంపెనీల బీర్లు ఆర్డర్లు పెట్టకుండా కృత్రిమ కొరత సృష్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ కొరతను సాకుగా చూపి ఈ కొత్త బ్రాండ్లను పరిచయం చేసేందుకు ప్రభుత్వం స్కెచ్‌ గీసినట్లుగా చర్చ జరుగుతోంది. తద్వారా భారీగా కమీషన్ పొందేందుకు ప్రభుత్వం ప్లాన్‌ చేసిందిని టాక్. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.

రాష్ట్రంలో కొత్త బ్రాండ్‌ల మద్యంకు అవకాశం ఇవ్వలేదని మంత్రి జూపల్లి చెప్పారు. కానీ సోం డిస్టిలరీస్ కంపెనీ తెలంగాణలో కొత్త బీర్లు తీసుకువస్తోంది. దీనిని బట్టి మంత్రి జూపల్లి చెప్పినవన్నీ అబద్దాలని తేలిపోయింది’ అని విమర్శించారు. ‘సోమ్ డిస్టిల‌రీస్‌లో కాంగ్రెస్ జాతీయ నేత దిగ్విజయ్ సింగ్ అవినీతికి పాల్పడ్డారని కేసు నడిచింది. 2013-14లో మరో రూ.25 లక్షలు, 2019లో సోమ్ డిస్టిల‌రీస్ కాంగ్రెస్ పార్టీకి రూ.1.31 కోట్లు విరాళాలు ఇచ్చింది. సోమ్ డిస్టిల‌రీస్ కార్యక్రమానికి దిగ్విజయ్ సింగ్ వెళ్లి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో అక్రమ మద్యానికి అడ్డుకట్ట వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అక్రమ మద్యానికి తలుపులు తెరిచారు. మధ్యప్రదేశ్‌లో సోమ్ డిస్టిల‌రీస్ సంస్థను సీజ్ చేశారు. పలుసార్లు ఆ డిస్టిల‌రీస్‌పై అధికారులు దాడులు జరిగాయి. కానీ సాక్షాత్తు ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావు అబద్ధాలు చెప్తున్నారు’ అని మన్నె మండిపడ్డారు. తెలంగాణలో బీర్లు అమ్మడానికి సోమ్ కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి ఏ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చారు? గతంలో సోమ్ డిస్టిల‌రీస్స్ కంపెనీ కారణంగా మధ్యప్రదేశ్‌లో 65 మంది చనిపోయారు. తాజాగా తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి చర్యలను ఉపసంహరించుకోవాలి. లేకపోతే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు.’ అని మన్నె ధ్వజమెత్తారు. మరి ఏంజరుగుతుందో చూద్దాం.

Read Also : NTR Jayanti : ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • Fake Liquor
  • KF Beer
  • KF Brand
  • liquor
  • New Beer
  • telangana

Related News

Heavy Rain Forecast for Telangana

తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. సోమవారం (జూన్ 8) ఇవి దక్షిణ సరిహద్దు జిల్లా అయిన జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రానున్న రెండు రోజుల్లో ఇవి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి తోడు ఉత్తరప్రదేశ్ నుండి కోస్తాంధ్ర వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవ

  • KTR Delivers Strong Counter to Pawan's Remarks

    KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Janasena Pawan Kalyan

    JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

  • DK SHIVA KUMAR

    CM DK SHIVAKUMAR : కర్ణాటక ముఖ్యమంత్రిగా నేడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

  • Janasena will contest in Telangana.

    Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

Latest News

  • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

  • Crime News Hyderabad: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు కు ఉరి శిక్ష, తల్లికి జీవిత ఖైదు

  • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

  • Nadendla Manohar: రేషన్ దుకాణాల్లో త్వరలో స్టీమ్‌ రైస్‌: మంత్రి నాదెండ్ల మనోహర్

  • Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd