HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Mlc Kavitha Employees Are Not Kcrs Stooges But Relatives

MLC Kavitha: ఉద్యోగులు కేసీఆర్ తొత్తులు కాదు, ఆత్మబంధువులు!

టీఎన్జీవో తో , తెలంగాణ ఉద్యోగులతో భారత రాష్ట్ర సమితికి, కేసీఆర్ గారికి ఒక తల్లికి, బిడ్డకు ఉన్న పేగు బంధం ఉందని ఎమ్మెల్సీ కవిత (Kavitha) తెలిపారు.

  • By Balu J Published Date - 12:38 AM, Sat - 7 January 23
  • daily-hunt
Mlc Kavitha
Mlc Kavitha

హైదరాబాద్: టీఎన్జీవో తో , తెలంగాణ ఉద్యోగులతో భారత రాష్ట్ర సమితికి, కేసీఆర్ గారికి ఒక తల్లికి, బిడ్డకు ఉన్న పేగు బంధం ఉందని ఎమ్మెల్సీ కవిత (Kavitha) తెలిపారు. నాంపల్లి లోని టీఎన్జీవో హైదరాబాద్ కార్యాలయంలో జరిగిన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్‌ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలో విజయవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా ఉండటానికి ఉద్యోగులే ప్రధాన కారణమని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

ఎన్నికల నిర్వహణలో ఉద్యోగ ఉపాధ్యాయులు పడే శ్రమ ఫలితంగానే భారతదేశ గౌరవం ప్రపంచ వ్యాప్తంగా వెలుగొందుతుందని, ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులు చేసిన త్యాగాలు మరువలేనివని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. ఉద్యోగులపై పూర్తి నమ్మకముందని సీఎం కేసీఆర్ అనేక సార్లు తెలిపారని, ప్రభుత్వ ఆలోచన విధానాలను ప్రజలకు చేరవేసి అమలు చేస్తారని తెలపారన్న ఎమ్మెల్సీ కవిత, భారత దేశంలో ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ప్రకటించుకున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని తెలిపారు.

కేసీఆర్ కిట్, భూ సంస్కరణలు లాంటి అనేక కార్యక్రమాలు సూపర్ హిట్ అయ్యాయంటే దానికి కారణం ఉద్యోగులే అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. భారతదేశంలో ఏ అవార్డులు వచ్చినా, తెలంగాణకే మొదటి మూడు అవార్డులు వస్తున్నాయన్న ఎమ్మెల్సీ కవిత, దీనికి కేసీఆర్ గారి ఆలోచనతో పాటు, ఉద్యోగుల కష్టం కూడా ముఖ్యమన్నారు. వ్యవసాయ శాఖలో 15 వేల మంది కొత్త ఉద్యోగులు, ఇంజనీరింగ్ విభాగంలొ 10వేల మంది కొత్త ఉద్యొగులు, ఇంకా ఇతర శాఖల్లో కొత్త ఉద్యోగాలను నియమించి అన్ని శాఖలను బలోపేతం చేస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. శాశ్వత ఉద్యోగులకు 73 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడంతొ పాటు, దేశంలో ఎక్కడా లేని విధంగా శాశ్వత ఉద్యోగుల ఫిట్ మెంట్ ను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం అమలు చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వమని ఎమ్మీల్సీ కవిత తెలిపారు.

ఉద్యోగులు కేసీఆర్ గారి తొత్తులు అన్న బండి సంజయ్ విమర్శలకు ఘాటుగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత, ఉద్యోగులు కేసీఆర్ గారి తొత్తులు కాదని, ఆత్మబందువులని స్పష్టం చేసారు. ఉద్యోగులు, ప్రభుత్వం వేరు కాదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో 13 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా,బీజేపీ ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదని, కానీ తెలంగాణలో లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగాల భర్తీని సైతం బండి సంజయ్ తప్పు పడుతూ, యువకులను నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశం మొత్తం తెలంగాణ మోడల్ మీద చర్చ జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సింగరేణి, బీహెచ్ ఈఎల్ లాంటి సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ప్రభుత్వ సంస్థలను అమ్ముతోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ అయాచితం శ్రీధర్‌, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్‌ చైర్మన్‌ గజ్జెల నగేష్‌, టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ ముజీబుద్ద్దీన్‌, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, టీఎన్జీవో హైదరాబాద్ అధ్యక్షుడు ముజీబ్‌ హుస్సేనీ, టీఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • kavitha kalvakunta
  • telangana politics

Related News

Maganti Sunitha

Maganti Sunitha: మాగంటి సునీత‌కు కేటీఆర్ మద్దతు వెనక రియల్ లైఫ్ డ్రామా?

గోపీనాథ్ మరణానంతరం కేటీఆర్ అద్భుతమైన రాజకీయ స్క్రిప్ట్ రాశారనే ప్రచారం జరిగింది. పి.జె.ఆర్. కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వకుండా 'సానుభూతి కార్డ్' పైనే ఉపఎన్నికల భవిష్యత్తును నిర్ణయించారు.

  • Minister Uttam

    Minister Uttam: అభివృద్ధి, సంక్షేమం కోసం నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వండి: మంత్రి ఉత్తమ్

  • 42 Percent Reservation

    Jubilee Hills By Election : బిజెపి, బిఆర్ఎస్ కుమ్మక్కు – మంత్రి పొన్నం

  • Jublihils Campign

    Jubilee Hills By Election : నగరవాసులకు కొత్త కష్టాలు

  • Congress

    Congress: సీఎం రేవంత్- అజారుద్దీన్‌ల వివాదంపై కాంగ్రెస్ క్లారిటీ!

Latest News

  • North Korea- South Korea: ఆ రెండు దేశాల మ‌ధ్య ముదురుతున్న వివాదం?!

  • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

  • MS Dhoni: ఐపీఎల్ 2026లో ధోని ఆడ‌నున్నాడా? క్లారిటీ ఇదే!

  • Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో గందరగోళం

  • Alcohol Sales : మద్యం అమ్మకాల్లో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు

Trending News

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd