HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Mlc Kavitha Bjp That Changes The Names Of The Schemes But Does Not Increase The Share

MLC Kavitha: పథకాల పేర్లు మార్చే బిజెపి… వాటా మాత్రం పెంచదు!

కేంద్ర ప్రాయోజిత పథకాల పేరులను మార్చుతున్న బిజెపి ప్రభుత్వం... ఆ పథకాల్లో భాగంగా రాష్ట్రాలకు అందించే తన వాటాను మాత్రం పెంచడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.

  • By Balu J Published Date - 08:21 PM, Sat - 4 February 23
  • daily-hunt
Mlc Kavitha, chandrababu
Mlc Kavitha

హైదరాబాద్: MLC Kavitha: కేంద్ర ప్రాయోజిత పథకాల పేరులను మార్చుతున్న బిజెపి ప్రభుత్వం… ఆ పథకాల్లో భాగంగా రాష్ట్రాలకు అందించే తన వాటాను మాత్రం పెంచడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కేంద్రం పథకాలు అమలు కోసం సరిపడా నిధులు ఇవ్వకుండా రాష్ట్రాలపై అదనపు భారం మోపుతుందని తెలిపారు. మధ్యాహ్న భోజన వర్కర్ల వేతనంతో కేంద్ర ప్రభుత్వం తన వాటాను ఒక్క రూపాయి కూడా పెంచకపోవడం బిజెపి నిర్లక్ష్య ధోరణి అర్థమవుతుందని చెప్పారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తమ వేతనాలను రూ. 3 వేలకు పెంచినందుకుగాను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మధ్యాహ్న భోజన వర్కర్ల కృతజ్ఞతలు తెలియజేశారు. తమ వేతనాల పెంపుదలకు కృషిచేసిన ఆమెను శనివారం నాడు హైదరాబాదులో మధ్యాహ్న భోజన వర్కర్లు కలుసుకొని ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ…. బిజెపి ప్రభుత్వం కేవలం పథకాల పేర్లు మార్చడానికి పరిమితమైందని ధ్వజమెత్తారు. మధ్యాహ్న భోజన పథకం పేరుని పీఎం పోషణ గా మార్చిన కేంద్ర ప్రభుత్వం వర్కర్లకు ఇస్తున్న తన వాటా ను మాత్రం పెంచలేదని విమర్శించారు. మధ్యాహ్న భోజన వర్కర్ల వేతనాలను రూ. 3 వేలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా కేవలం రూ. 600 మాత్రమే చెల్లిస్తుందని, మిగతా రూ. 2400 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నదని వివరించారు.

ప్రజలంతా గౌరవప్రదంగా జీవించాలన్నదే బీఆర్ఎస్ ప్రభుత్వ విధానమని, అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా కూడా మధ్యాహ్న భోజన వర్కర్ల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని తెలిపారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS MLC
  • kalvakuntla kavitha
  • MLC Kavitha

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd