Talasani Teenmar: మంత్రి తలసాని స్టెప్పెస్తే..!
తెలంగాణలో బోనాల సందడి నెలకొంది. జోరు వర్షంలోనూ బోనాలను నిర్వహించుకుంటున్నారు ప్రజలు.
- By Balu J Published Date - 02:33 PM, Fri - 15 July 22
తెలంగాణలో బోనాల సందడి నెలకొంది. జోరు వర్షంలోనూ బోనాలను నిర్వహించుకుంటున్నారు ప్రజలు. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో బోనాలు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నూతనంగా నిర్మించిన సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ ముఖ ద్వారాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోమంత్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని స్టెప్పులు వేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహంకాళి దేవాలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. మంత్రి తలసాని కుటుంబ సభ్యులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు. ప్రస్తుతం మంత్రి తలసాని చేసిన డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ ముఖ ద్వారాల ను ప్రారంభించి మహంకాళి అమ్మవారికి కుటుంబసభ్యులతో కలిసి బంగారు బోనం సమర్పించడం జరిగింది. pic.twitter.com/I1D5gCdqvy
— Talasani Srinivas Yadav (@YadavTalasani) July 15, 2022
Related News
Viral Video: సమ్మర్ ఎఫెక్ట్.. స్విమ్మింగ్ పూల్గా మారిన క్లాస్రూం, వీడియో వైరల్
Viral Video: పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య ఉత్తరప్రదేశ్ లోని ఓ పాఠశాలలో విద్యార్థుల హాజరు కోసం తరగతి గదిని స్విమ్మింగ్ పూల్ గా మార్చారు టీర్లు. కొందరు పిల్లలు తరగతి గదిలోని ఒక మూల నుంచి మరో మూలకు ఈత కొడుతూ కేరింతలు చేస్తుండగా, మరికొందరు ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకున్న వీడియో ఒకటి ట్విటర్లో చక్కర్లు కొడుతోంది. పంట కోతలు, వడగాల్పుల కారణంగా విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరవుతున్నంద