HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Minister Ponnam Key Decision On The Transport Department

Ponnam Prabhakar: రవాణాశాఖలో కీలక మార్పులు: మంత్రి పొన్నం ప్రభాకర్

  • By Kode Mohan Sai Published Date - 04:41 PM, Tue - 8 October 24
  • daily-hunt
Minister Ponnam
Minister Ponnam

హైదరాబాద్: రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) రవాణా శాఖలో కొన్ని ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, మోటారు వాహన చట్టం కింద 28 రాష్ట్రాలు ఇప్పటికే సారథి వాహన్ పోర్టల్‌ను అమలు చేస్తున్నాయన్నారు. ఇంటర్ స్టేట్ రిలేషన్స్‌కు ఇబ్బంది కలగకుండా, క్షేత్ర స్థాయిలో ఆర్టీవో మరియు డీటీవోలతో సమావేశాలను ఏర్పాటు చేసి, తెలంగాణ కూడా సారథి వాహన పోర్టల్‌లో చేరేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జీవో 28 ద్వారా ఈ వ్యవస్థ అమలు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో మరియు దేశంలో వాహనాలకు సంబంధించిన 15 సంవత్సరాల పాత వాహనాలు మరియు 8 సంవత్సరాల ప్రైవేట్ వాహనాల కోసం స్క్రాపింగ్ పాలసీ తీసుకురావడం జరిగిందన్నారు.

యునిసెఫ్ సహకారంతో కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అమలవుతున్న పాలసీలను అధ్యయనం చేసి, అక్కడి విధానాలను ఇక్కడ అమలు చేయడానికి జీవో తీసుకురావాలని మంత్రి పేర్కొన్నారు. వాహనాల చెకింగ్‌కు సరైన విధానం అమలు జరగడం లేదని గుర్తించిన ఆయన, ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఒక్కో సెంటర్‌కు రూ. 8 కోట్లు ఖర్చు అవుతుందని, రాష్ట్రంలో మొత్తం 32 సెంటర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.

తెలంగాణలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రత్యేక నిబంధనలు తీసుకువస్తున్నామని మంత్రి తెలిపారు. రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాల్లో యునిసెఫ్ సహకారం పొందుతున్నామని పేర్కొనడంతో పాటు, ప్రతి పాఠశాలలో రోడ్డు సేఫ్టీపై అవగాహన కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. వచ్చే నెలలో జరగబోయే రోడ్డు సేఫ్టీ మంత్ సందర్భంగా సిగ్నల్, జీబ్రా క్రాసింగ్ వంటి అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని, ఇప్పటి వరకు 8,000 లైసెన్సులు రద్దు చేసినట్లు వివరించారు.

“ఎవరైనా రూల్స్ పాటించాల్సిందే,” అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. “ప్రాణాలు పోతాయన్న దృష్ట్యా, సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే, డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఉండదు. వాహనాలు కొనుక్కున్నా, వారి పేరు మీద నమోదు చేసుకునే అవకాశం ఉండదు. ప్రాణ నష్టాన్ని నివారించడానికి అవగాహన క్రియేట్ చేయడం చిన్న పిల్లల నుంచి మొదలుకొని అందరికి అవసరమైంది. ర్యాష్ డ్రైవింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ వాహనాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.”

“కొత్తగా 113 మంది వెహికిల్ ఇన్స్పెక్టర్లు నియమితులయ్యారు. వారిని మరింతగా ఉపయోగించుకుంటాం. ఆర్టీసీలో ఎంవీఐ రూల్స్ అమలవుతున్నాయి. ఎక్కడా ఇబ్బంది లేదు. జీహెచ్‌ఎంసీలోని వాహనాలు కూడా రూల్స్ పాటించాల్సిందే. ప్రభుత్వ వాహనాలకు కూడా నిబంధనలు వర్తిస్తాయి. రెండు రాష్ట్రాలకు సంబంధించి రవాణా శాఖ విషయాలను అధికారులు చర్చిస్తారు. టీఎస్ నుంచి టీజీకి మారినప్పుడు, టీఎస్ వాహనాలు మళ్లీ టీజీగా మారుతాయో లేదో చెప్పలేదు. కొత్త వాహనాలు మాత్రం టీజీగా వస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో వాహనాలు లైసెన్స్ రద్దు అవుతాయి, అప్పుడు వారు వాహనాలు కొనలేరు,” అని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) పేర్కొన్నారు. “మా డిపార్ట్‌మెంట్ ద్వారా మాత్రమే కాకుండా, యునిసెఫ్ సహకారంతో కూడా అవగాహన కల్పిస్తున్నాం.”


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ‘TS' change to TG
  • minister ponnam prabhakar
  • Ponnam Prabhakar
  • TG News
  • tg number plate

Related News

Minister Ponnam Prabhakar letter to floor leaders of all parties

Minister Ponnam Prabhakar : అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లకు మంత్రి పొన్నం లేఖ

రాజకీయ పరంగా కీలకమైన ఈ ఆహ్వానం, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి ప్రభుత్వ వైఖరిని వివరించేందుకు గవర్నర్‌తో భేటీ కావడమే లక్ష్యంగా ఉంది. ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం నాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఛాంబర్‌ను సందర్శించారు.

  • Telangana Assembly approves 42 percent reservation amendment bills for BCs

    Telangana : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

Latest News

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd