HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Ktr Visited The Victims Of Ants

KTR: చీమ‌ల‌పాడు బాధితులను పరామర్శించిన మంత్రి కేటీఆర్

ఖమ్మం జిల్లా వైరా నియోజ‌క‌వ‌ర్గంలోని కారేప‌ల్లి మండ‌లం చీమ‌ల‌పాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం వ‌ద్ద జ‌రిగిన‌ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

  • By Praveen Aluthuru Published Date - 11:40 AM, Thu - 13 April 23
  • daily-hunt
Minister Ktr Visited The Victims Of Ants
Minister Ktr Visited The Victims Of Ants

KTR : ఖమ్మం జిల్లా వైరా నియోజ‌క‌వ‌ర్గంలోని కారేప‌ల్లి మండ‌లం చీమ‌ల‌పాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం వ‌ద్ద జ‌రిగిన‌ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురు వ్యక్తులు హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ నిమ్స్ కు వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. మంత్రి కేటీఆర్ (KTR) తో పాటు ఎంపీ నామా నాగేశ్వర రావు ఉన్నారు.

అగ్ని ప్రమాదంలో గాయపడ్డ బాధితుల పరిస్థితిని నిమ్స్ వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రాణాపాయం లేదని డాకర్లు మంత్రికి తెలిపారు. కాగా.. వారికీ మెరుగైన ఆరోగ్యం అందించాలని డాక్టర్లకు సూచించారు కేటీఆర్. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… చీమలపాడులో జరిగిన ఘటన చాలా బాధ కలిగించింది. ప్రమాదంపై దర్యాప్తు జరుగుతుంది. ఘటనలో మరణించిన కుటుంబ సభ్యులకు 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు మంత్రి. అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వారికీ 2 లక్షల చొప్పున ప్రభుత్వం నుండి సాయం ప్రకటించారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు కెసిఆర్. గాయపడ్డ వారికీ మెరుగైన వైద్యం అందించాల్సిందిగా నిమ్స్ వైద్యులను ఆదేశించారు. ఇక నామా నాగేశ్వర రావు కూడా ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ముత్తయ్య ట్రస్ట్ ద్వారా చనిపోయిన వారికీ 2 లక్షలు, గాయపడ్డ వారికి 50 వేలు సాయం అందిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ బాధితులకు లక్ష రూపాయలు ప్రకటించారు.

ఖమ్మం జిల్లా చీమలపాడు ఏజెన్సీలోని కారేపల్లి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ నామా నాగేశ్వర రావు, ఎమ్మెల్యే రాములు నాయక్ వస్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. దీంతో చిన్న నిప్పు రవ్వ కూతవేటు దూరంలో ఉన్న గుడిసెపై పడింది. దాంతో అందులో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించాయి. సెకనులో ప్రమాదం తీవ్రతరంగా మారడంతో సభకు వచ్చిన కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Also Read:  KTR: చీమలపాడు అగ్ని ప్రమాద బాధితులకు కేటీఆర్ భరోసా!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ants
  • hyderabad
  • ktr
  • Minister
  • telangana
  • victim
  • visit

Related News

Election Schedule

Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీలకు ఒక పరీక్షగా నిలవనున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి.

  • Ktrtirupthi

    Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

  • Trump Tariffs Pharma

    Trump Tariffs Pharma : “ఫార్మా” పై ట్రంప్ సుంకాల ప్రభావం ఎంత ఉండబోతుంది..?

  • Wine Shops Closed Dasara Oc

    Dasara : మందుబాబులకు ముందే హెచ్చరిక జారీ చేసిన వైన్స్ షాప్స్

  • L&thyd

    L&T : L&T వెళ్లిపోవడానికి కారణం రేవంత్ రెడ్డినే – కేటీఆర్

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

  • 42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd