HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Ktr Visited The Victims Of Ants

KTR: చీమ‌ల‌పాడు బాధితులను పరామర్శించిన మంత్రి కేటీఆర్

ఖమ్మం జిల్లా వైరా నియోజ‌క‌వ‌ర్గంలోని కారేప‌ల్లి మండ‌లం చీమ‌ల‌పాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం వ‌ద్ద జ‌రిగిన‌ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

  • Author : Praveen Aluthuru Date : 13-04-2023 - 11:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Ktr Visited The Victims Of Ants
Minister Ktr Visited The Victims Of Ants

KTR : ఖమ్మం జిల్లా వైరా నియోజ‌క‌వ‌ర్గంలోని కారేప‌ల్లి మండ‌లం చీమ‌ల‌పాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం వ‌ద్ద జ‌రిగిన‌ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురు వ్యక్తులు హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ నిమ్స్ కు వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. మంత్రి కేటీఆర్ (KTR) తో పాటు ఎంపీ నామా నాగేశ్వర రావు ఉన్నారు.

అగ్ని ప్రమాదంలో గాయపడ్డ బాధితుల పరిస్థితిని నిమ్స్ వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రాణాపాయం లేదని డాకర్లు మంత్రికి తెలిపారు. కాగా.. వారికీ మెరుగైన ఆరోగ్యం అందించాలని డాక్టర్లకు సూచించారు కేటీఆర్. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… చీమలపాడులో జరిగిన ఘటన చాలా బాధ కలిగించింది. ప్రమాదంపై దర్యాప్తు జరుగుతుంది. ఘటనలో మరణించిన కుటుంబ సభ్యులకు 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు మంత్రి. అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వారికీ 2 లక్షల చొప్పున ప్రభుత్వం నుండి సాయం ప్రకటించారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు కెసిఆర్. గాయపడ్డ వారికీ మెరుగైన వైద్యం అందించాల్సిందిగా నిమ్స్ వైద్యులను ఆదేశించారు. ఇక నామా నాగేశ్వర రావు కూడా ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ముత్తయ్య ట్రస్ట్ ద్వారా చనిపోయిన వారికీ 2 లక్షలు, గాయపడ్డ వారికి 50 వేలు సాయం అందిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ బాధితులకు లక్ష రూపాయలు ప్రకటించారు.

ఖమ్మం జిల్లా చీమలపాడు ఏజెన్సీలోని కారేపల్లి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ నామా నాగేశ్వర రావు, ఎమ్మెల్యే రాములు నాయక్ వస్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. దీంతో చిన్న నిప్పు రవ్వ కూతవేటు దూరంలో ఉన్న గుడిసెపై పడింది. దాంతో అందులో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించాయి. సెకనులో ప్రమాదం తీవ్రతరంగా మారడంతో సభకు వచ్చిన కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Also Read:  KTR: చీమలపాడు అగ్ని ప్రమాద బాధితులకు కేటీఆర్ భరోసా!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ants
  • hyderabad
  • ktr
  • Minister
  • telangana
  • victim
  • visit

Related News

Rajya Sabha Elections

Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలోని రెండు స్థానాలు సహా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్, మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణ నుంచి సురేశ్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీలతో పాటు 37 మంది పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది. మహారాష్ట్రలో 7, ఒడిశా 4, తమిళనాడు 6, పశ్చిమ

  • Vijayendra Prasad

    మా పూర్వీకులు భయంకరమైన తప్పు చేశారు.. క్షమించండి: విజయేంద్రప్రసాద్‌

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Half Day Schools

    Half-Day Schools: తెలంగాణ లో ఒంటిపూట బడులు ఎప్పటి నుండి అంటే ..!!

Latest News

  • Ramzan : రంజాన్ సందర్బంగా మహిళా ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్

  • ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం..

  • Gold Price : బంగారం కొనుగోలు చేయాలనుకున్నవారికి ఇదే మంచి ఛాన్స్.. !!

  • ధూమపాన ప్రియులకు షాక్..

  • ఇరాన్‌పై యుద్ధ మేఘాలు!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd