KTR: కేంద్రం నిధులు ఇవ్వకపోయినా.. మెట్రో రెండో దశను పూర్తి చేస్తాం!
హైదరాబాద్లో మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించినా, చేయకపోయినా రెండో దశ మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం
- By Balu J Published Date - 01:13 PM, Sat - 26 November 22
హైదరాబాద్లో మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించినా, చేయకపోయినా రెండో దశ మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శుక్రవారం శిల్పా-లేఅవుట్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రెండవ దశ మెట్రో ప్రాజెక్టును చేపట్టడానికి కట్టుబడి ఉందని, మెట్రో ప్రాజెక్టు మొదటి దశ మాదిరిగానే పూర్తి చేస్తామని చెప్పారు.
‘మెట్రో ప్రాజెక్టు రెండో దశలో లక్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ (26 కి.మీ.), నాగోల్ నుంచి ఎల్.బి.నగర్ (5 కి.మీ) వరకు రెండు మార్గాలను ప్రతిపాదించారు. ఇది కాకుండా, విమానాశ్రయం నుండి మైండ్స్పేస్ (32 కి.మీ) వరకు మరో మార్గం కూడా అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది.రూ.కోట్లు విడుదల చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
‘‘ కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయిందని మీకు తెలుసు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇవ్వడానికి వెనకడుగు వేస్తోంది. ఈ రెండు కారణాల వల్ల షెడ్యూల్ ప్రకారం మెట్రో రెండో దశ ప్రాజెక్టును చేపట్టలేకపోతున్నాం. అయితే, ఈ ప్రాజెక్టును ఎంతకైనా తెగించి పూర్తి చేస్తాం’’ అని కేటీఆర్ అన్నారు.
Related News
Bengaluru Win: సన్రైజర్స్ జోరుకు బ్రేక్ వేసిన ఆర్సీబీ.. ఎట్టకేలకు రెండో విజయం నమోదు చేసుకున్న బెంగళూరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగుల భారీ స్కోరు సాధించింది.