Mallu Swarajyam: మల్లు స్వరాజ్యం ఇకలేరు!
తెలంగాణ సాయుధ పోరాటంలో తనవంతు పాత్ర పోషించిన యోధురాలు మల్లు స్వరాజ్యం (92) తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
- By Balu J Updated On - 10:07 AM, Sun - 20 March 22

తెలంగాణ సాయుధ పోరాటంలో తనవంతు పాత్ర పోషించిన యోధురాలు మల్లు స్వరాజ్యం (92) తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆమె కొన్నిరోజులుగా కేర్ ఆస్పత్రి వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది. చికిత్స పొందుతున్న ఆమె శనివారం హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల తెలంగాణ మేదావులు, రాజకీయనాయకులు సంతాపం వ్యక్తం చేశారు. సీపీఎం పార్టీ నుండి ఎమ్మెల్యే గానూ పనిచేశారు. మల్లు స్వరాజ్యం కుటుంబం మొత్తం చివరి వరకు పేద ప్రజల హక్కుల కోసం, ఎర్రజెండా పట్టి ప్రజా పోరాటాలకు ఊపిరి పోశారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా సీపీఎం కార్యదర్శిగా పని చేస్తున్న మల్లు నాగార్జున రెడ్డి ఆమె కుమారుడే కావడం విశేషం. ఆమె కోడలు మల్లు లక్ష్మీ కూడా సీపీఎం పార్టీలో రాష్ట్ర స్థాయి నేతగా పని చేస్తున్నారు.
మల్లు స్వరాజ్యం స్వగ్రామం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం. భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించించారు స్వరాజ్యం. 1945- 46 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కార్ కు వ్యతిరేకంగా ఆమె పోరాడారు. స్వరాజ్యం భర్త మల్లు వెంకట నర్సింహారెడ్డి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. సోదరుడు దివంగత ఎంపీ భీమిరెడ్డి నరసింహారెడ్డి. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1978- 83, 1983- 84 వరకు రెండు సార్లు ఆమె ఎమ్మెల్యేగా పని చేశారు.
Related News

Bakrid : బక్రీద్ సందర్భంగా అధికారులతో హైదరాబాద్ సీపీ రివ్యూ మీటింగ్
హైదరాబాద్: త్వరలో జరగనున్న బక్రీద్ పండుగ ఏర్పాట్ల కోసం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సాలార్ జంగ్ మ్యూజియంలో అన్ని శాఖల అధికారులు, ముస్లిం మతపెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముస్లిం మతపెద్దలు వీధులను పరిశుభ్రంగా ఉంచేంలా చూడాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలపై సమీక్షించారు. 300 శానిటేషన్ వాహనాలు, అదనంగా 55 వాహనాలు నేరుగా పో