KTR: పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజార్టీ సాధించి పూర్వవైభవాన్ని సాధించుకుందాం: కేటీఆర్
- By Balu J Published Date - 05:44 PM, Sun - 25 February 24
KTR: పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా అచ్చంపేటలో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. మా పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని, మరి కొద్ది రోజులు భరిస్తాం.. తర్వతా వాళ్లు ఇటుకలతోని కొడితే మేము రాళ్లతోనే కొడతాం అని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు కోసం మోహాలు చూసుకునే పరిస్థితి వచ్చిందని, కరెంటు కోతలు, తాగునీటి గోసలు ప్రారంభమైనాయి.. ఇదేనా మార్పు అంటే అంటే అని కేటీఆర్ మండిపడ్డారు.
‘‘మిషన్ భగీరథను నిర్వహించే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులే అధికారంలోకి వస్తామని అనుకోలేదు… అందుకే అడ్డగోలుగా హామీలు ఇచ్చారు అందరికీ అన్ని ఇస్తామన్నారు. అప్పుడేమో అందరికీ అన్ని ఇప్పుడేమో కొందరికి మాత్రమే కొన్ని ఇస్తామంటున్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు ఆడబిడ్డలకి రూ. 2500 ప్రతినెలా ఇస్తామన్నారు.. ఇంట్లో అవ్వతాతలకు ఇద్దరికీ రూ. 4,000 చొప్పున ఇస్తామన్నారు. ఎలక్షన్ కమిషన్ లెక్క ప్రకారం ఒకటి కాదు రెండు కాదు కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలున్నారు. వాళ్లందరి నెలకు 2500 ఎప్పుడిస్తారని ఎదురుచూస్తున్నారు’’ అని కేటీఆర్ అన్నారు.
‘‘500 రూపాయలకే సిలిండర్ అన్నడు…కోటి 24 లక్షల గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి… వాళ్ళందరూ ఎదురుచూస్తున్నారు. 200 యూనిట్లు ఫ్రీ అని అప్పుడేమో అందరికీ అన్ని ఇస్తా అన్నాడు, కానీ ఇప్పుడు కొందరికే అంటున్నారు. వందరోజుల పాటు ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం అనుకున్నాము… శ్రీకృష్ణుడు శిశుపాలుడి 100 తప్పులు లెక్కపెట్టినట్లు ఆగుదామనుకున్నాం. కానీ తొలి అసెంబ్లీ సమావేశంలోనే మా పార్టీ పైన, మా పార్టీ అధినేత పైన అడ్డగోలుగా విమర్శలు చేశారు. పార్టీ కార్యకర్తలు ఎలాంటి పదవులు ఆశించకుండా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం సంవత్సరాల పాటు కష్టపడి పని చేశారు
వారందరికీ భవిష్యత్తు పైన భరోసా ఉంది నమ్మకం ఉన్నది. పార్టీ నాయకులు కార్యకర్తలను ఒక్క సంవత్సరం కాపాడుకుంటే ఆ కార్యకర్తలే నాయకులను కాపాడుకుంటారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
‘‘వచ్చిపోయే ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నా… తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక్కరేతెలంగాణ తెచ్చిన కేసీఆర్ చరిత్రను ఎవరు చెరిపేయలేరు. మోడీ హవా లేదు.. ఏంలేదు
పాలమూరు రంగారెడ్డికి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని ప్రధాని మోడీ మనకు ఎందుకు అలోచించాలి. మన కృష్ణ నది పైన ఉన్న నీళ్లన్ననింటిని కేఆర్ఎంబికి అప్పజెప్పి, ఢిల్లీ వాళ్ల చేతిలో పెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి. నల్లగొండలో మన పార్టీ మీటింగ్ పెడితే దెబ్బకు అసెంబ్లీలో తీర్మానం పెట్టి కెఆర్ఎంబికి ఇయ్యలేనని తీర్మానం పెట్టిండు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బకొడుతున్నాయి.అందుకే ఏ రోజు అయినా ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాపాడబడతాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజార్టీ సాధించి పూర్వవైభవాన్ని సాధించుకుందాం ’’ అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
Related News
KCR-KTR: ఖమ్మం మాజీ DCMS ఛైర్మన్ మృతి.. కేసీఆర్, కేటీఆర్ సంతాపం
KCR-KTR: ఖమ్మం డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల శేషగిరిరావు మృతి చెందాడు. ఖమ్మం జిల్లాకు బీఆర్ఎస్ కు ఆయన విశేష సేవలందింరు. ఆయన మృతి వల్ల బీఆర్ఎస్ కు, ఖమ్మం జిల్లాకు తీరని లోటు. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరి రావు మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారితో దశాబ్దాలకాలంగా తనకున్న రాజకీయ అనుబంధాన్ని, �