HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Lakshmi Narasimha Swami Darshan In Yadadri Starts From Today

Yadadri Temple: తెలంగాణ ఇలవేల్పు లక్ష్మీనరసింహస్వామి దర్శనం జన్మజన్మల పుణ్యఫలం

తెలంగాణ ఇలవేల్పు. భక్తులపాలిట కొంగుబంగారం. ప్రతీ సంవత్సరం కుటుంబమంతా కనీసం ఒక్కసారైనా యాదగిరిగుట్టకు వెళ్లి ఆ భగవంతుడిని దర్శించుకోవడం తెలంగాణ ప్రజలకు అలవాటు. ఇప్పుడు గుడి పునర్నిర్మాణంతో కొత్త శోభను సంతరించుకుంది. పూర్తిగా కృష్ణశిలలతోనే నిర్మాణమైంది. శిల్పకళను చూడడానికి రెండు కళ్లూ చాలవు.

  • Author : hashtagu Date : 28-03-2022 - 10:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
68
68

తెలంగాణ ఇలవేల్పు. భక్తులపాలిట కొంగుబంగారం. ప్రతీ సంవత్సరం కుటుంబమంతా కనీసం ఒక్కసారైనా యాదగిరిగుట్టకు వెళ్లి ఆ భగవంతుడిని దర్శించుకోవడం తెలంగాణ ప్రజలకు అలవాటు. ఇప్పుడు గుడి పునర్నిర్మాణంతో కొత్త శోభను సంతరించుకుంది. పూర్తిగా కృష్ణశిలలతోనే నిర్మాణమైంది. శిల్పకళను చూడడానికి రెండు కళ్లూ చాలవు. దాదాపు ఆరేళ్లయ్యింది.. ఆ లక్ష్మీనరసింహుడి స్వయంభూ దర్శనాన్ని చేసుకుని. ఇప్పుడు మహాకుంభ సంప్రోక్షణ తరువాత మళ్లీ భక్తులకు మామూలు దర్శనం మొదలైంది.

వెలుగులు విరజిమ్ముతున్న యాదాద్రి ఆలయాన్ని చూసి భక్తులు తన్మయత్వంతో పులకిస్తున్నారు. తిరుమలలో వెంకన్న స్వామిని రోజూ దాదాపు 50 వేల మంది భక్తులు.. పర్వదినాల్లో రోజూ 70-80 వేల మంది భక్తులు దర్శించుకుంటారు. వారికి సరిపడా వసతులను ఏర్పాటుచేశారు. అలాగే.. యాదాద్రిలోనూ రోజూ 50 వేల మంది భక్తులు దర్శించుకున్నా సరే.. ఎవరికీ ఏ లోటూ రాకుండా ఏర్పాట్లు చేశారు. గత ఆరేళ్ల లెక్కలు చూసినా సరే.. బాలాలయంలో కొలువుదీరిన నరసింహస్వామిని రోజూ దాదాపు 8 వేల మంది దర్శించుకున్నారు. అదే సెలవురోజుల్లో అయితే ఈ సంఖ్య 30-40 వేల వరకు ఉంది. ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశముంది.

17వ శతాబ్దం తరువాత రాతి నిర్మాణాలే కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు రెండున్నర లక్షల టన్నుల కృష్ణ శిలలతో యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దారు. దీనికోసం 1200 మంది శిల్పులు కష్టడ్డారు. ఇంటర్ లాకింగ్ టెక్నాలజీని ఉపయోగించి.. ఇక ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సరే.. ఏమీ కాకుండా 1000 ఏళ్లపాటు ఆలయం నిలిచి ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

యాదాద్రి ఆలయాన్ని పరిశీలిస్తే.. రాజుల కాలం నాటి నిర్మాణ శైలి కనిపిస్తుంది. ఆలయ ప్రాకారంలో ఏర్పాటు చేసిన అష్టభుజి మండపాల వల్ల రథయాత్ర సమయంలోనూ భక్తులు వాటిలో కూర్చుని చూడవచ్చు. ఈ ఆలయంలో ముఖ మండపం ఎత్తు 38 అడుగులు. దీనికి ఆధారంగా ఉండేలా 11 అడుగుల ఎత్తుతో 12 మంది ఆళ్వార్ల రాతి శిల్పాలు ఇందులో చెక్కారు. ఇలా ఒకటా రెండా.. ఎన్నో అద్భుతాలు ఈ ఆలయంలో భక్తులకు ఆధ్యాత్మిక పరిమళాలను అందిస్తాయి. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు రూ.1200 కోట్లు ఖర్చయ్యింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • lakshmi narasimha swamy
  • telangana
  • yadadri

Related News

bjp Mp Godam Nagesh

తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

Bjp Mp Godam Nagesh  ఆదిలాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుంది. జిల్లాలో కొత్తగా ఎయిర్‌పోర్టు కానుంది. ఈ మేరకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్‌ను ఎంపీ గోడం నగేష్ విడుదల చేశారు. త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం అవుతాయని ఎంపీ వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఆదిలాబాద్ కొత్త ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్ల

  • Rajya Sabha Elections

    Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Half Day Schools

    Half-Day Schools: తెలంగాణ లో ఒంటిపూట బడులు ఎప్పటి నుండి అంటే ..!!

Latest News

  • Kavitha New Party : కవిత పార్టీ సిద్ధాంతాలు ఇవే !!

  • బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

  • కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.కవిత కీలక ప్రకటన

  • హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

  • ఏఐ సమ్మిట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు..చిన్ననాటి విశాఖపట్నం ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుందర్ పిచాయ్

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd