KTR Uncle: కేటీఆర్ మామ మృతి.. వియ్యంకుడికి కేసీఆర్ నివాళి!
తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) మామ చనిపోయారు. సీఎం కేసీఆర్ తన వియ్యకుండికి నివాళి అర్పించారు.
- By Balu J Published Date - 04:15 PM, Thu - 29 December 22
తన వియ్యంకుడు, మంత్రి కేటీఆర్ (KTR) మామ పాకాల హరినాథరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR) తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని రాయదుర్గం వద్ద గల వారి నివాసానికి వెళ్ళి దివంగత హరినాథరావు భౌతిక కాయానికి సీఎం నివాళులర్పించారు. శోకతప్తులైన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి ఓదార్చారు. హరినాథరావు గుండెపోటుతో కన్నుమూశారు.
నిన్న సాయంత్రం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆయనను బతికించడానికి వైద్యులు అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. హరినాథరావు మృతి వార్తతో కేటీఆర్ (KTR), ఆయన భార్య శైలిమ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన పార్థివదేహాన్ని రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ లో ఉన్న నివాసానికి తరలించారు. ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ శ్రేణులు సంతాపాన్ని ప్రకటించాయి.
Also Read : ICICI Bank Fraud: పోలీసుల కస్టడీకి చందా కొచ్చర్ దంపతులు, వేణుగోపాల్ ధూత్!
Related News
Hanuman: భాగ్యనగరంలో మార్మోగిన హనుమాన్ నామస్మరణ, పాల్గొన్ననేతలు
Hanuman: హనుమాన్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మోండా మార్కెట్ పెరుమాళ్ వెంకటేశ్వర దేవాలయం వద్ద శివాజీ నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మోండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక హాజరయ్యారు. ఈటెల రాజేందర్ భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అనంతరం పార్టీలో చేరిన కోనే�