KTR : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో నేత కార్మికలకు బీమా పథకం..!!
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఈ వారాన్ని లేదా నెలను ఓ మంచి వార్తతో ప్రారంభిద్దామని పేర్కొన్నారు.
- By hashtagu Published Date - 03:42 PM, Mon - 1 August 22
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఈ వారాన్ని లేదా నెలను ఓ మంచి వార్తతో ప్రారంభిద్దామని పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం చేనేత, మరమగ్గం, కార్మికులందరికీ సరికొత్త బీమా సదుపాయాన్ని తీసుకువస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ సర్కార్ ఈ బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. రైతు బీమా తరహాలోనే చేనేత కార్మికులకు బీమా సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడం ఇదే ప్రథమమని వెల్లడించారు కేటీఆర్.
దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా తెలంగాణలో నేత కార్మికులకు బీమా పథకం.
రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా పథకం అమలు. ఈనెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం రోజున ప్రారంభం కానున్న ఈ పథకం.
దీని ద్వారా రాష్ట్రంలోని సుమారు 80 వేల మంది నేత కార్మికులకు కలగనున్న లబ్ది.@KTRTRS pic.twitter.com/kenqV7TKOc
— TRS Party (@trspartyonline) August 1, 2022
Related News
KTR : లోక్ సభ ఎన్నికల తర్వాత వాళ్లిద్దరూ కనిపించారు..కేటీఆర్
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మల్కాజిగిరి (Malkajigiri) పార్లమెంట్ పరిధిలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ఈటల రాజేందర్(Etala Rajender), సునీతా మహేందర్ రెడ్డి( Sunita Mahender Reddy) కనిపించరని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసే ఉంటే.. కవితన�