HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Challenge To Ponguleti Srinivas Reddy

KTR : అలా నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా : పొంగులేటికి కేటీఆర్‌ సవాల్‌

Amrit Scheme Tenders : ఒక మంత్రి తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని బిల్డప్ ఇచ్చారు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గరకి పోదాం. వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వయిరీ చేయిద్దాం.

  • Author : Latha Suma Date : 22-09-2024 - 7:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR challenge to Ponguleti Srinivas Reddy
KTR challenge to Ponguleti Srinivas Reddy

KTR vs Ponguleti: అమృత్ పథకం టెండర్ల వ్యవహారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆదివారం హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. అమృత్ పథకం టెండర్లలో ఎలాంటి తప్పులు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సవాల్ విసిరారు. ఒక మంత్రి తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని బిల్డప్ ఇచ్చారు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గరకి పోదాం. వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వయిరీ చేయిద్దాం. సిట్టింగ్ జడ్జి గనుక ఇందులో తప్పులు ఎం జరగలేదు అంటే.. నేను రాజకీయ సన్యాసం చేస్తా’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైకోర్టు సీజే దగ్గరికి రాడానికి మంత్రిగారికి ఇబ్బంది ఉంది అంటే డేట్, టైం ఫిక్స్ చేయండి ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ దగ్గరికి పోదామని అన్నారు.

చిత్తశుద్ధి ఉంటే.. హైకోర్టు సీజే దగ్గరకు మంత్రి పొంగులేటి తనతో రావాలి..

ఇప్పటికైనా టెండర్లు రద్దు చేయాలని మంత్రి, ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. బావమరిదికి అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన వ్యవహారం రేవంత్ మెడకు చుట్టుకుంటుందన్నారు. భార్య సోదరుడు బావమరిది కాకుండా ఏమవుతారని ప్రశ్నించారు. చట్టాలే కాదు.. చుట్టరికాలు కూడా ప్రభుత్వ పెద్దలకు తెలియనట్లుందని అన్నారు. ఫోర్త్ సిటీ కాదు.. ముచ్చర్ల ఫోర్ బ్రదర్స్ సిటీ అంటూ ఎద్దేవా చేశారు. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన తమకు ఎక్కడ అవినీతి జరుగుతుందో తెలియదా? అని ప్రశ్నించారు. కొడంగల్ లిఫ్ట్ కథ సహా.. సీఎం రేవంత్ కుటుంబ అవినీతిని తేలుస్తామన్నారు. బావమరిది వ్యవహారంలో ఇరికిపోయాడని సీఎంకు కూడా తెలుసన్నారు. చిత్తశుద్ధి ఉంటే.. హైకోర్టు సీజే దగ్గరకు మంత్రి పొంగులేటి తనతో రావాలని, టెండర్లలో తప్పులేమీ జరగలేదంటే.. రాజకీయ సన్యాసం చేస్తానని అన్నారు. సీఎం ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని టెండర్లు రద్దు చేయాలన్నారు.

సింగరేణిని కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ వెన్నుపోటు..

మరోవైపు, బీఆర్‌ఎస్‌ పాలనలో సింగరేణి అద్భుత ప్రగతి సాధించిందన్నారు కేటీఆర్‌. పదేళ్లలో సింగరేణి లాభాలు గణనీయంగా పెరిగాయన్నారు. లాభాల్లో కార్మికుల వాటా పెంచుకుంటూ వచ్చామని చెప్పారు. లాభాలను వెయ్యి కోట్లు దాటించిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదే. తొమ్మిదిన్నరేండ్లలో తాము రూ.2,780 కోట్లు ఇచ్చామని కార్మికులకు ఇచ్చామని కేటీఆర్ చెప్పారు. 2022-23లో సింగరేణి లాభాల్లో కార్మికులకు 32 శాతం వాటా ఇచ్చామని, సగటున ఒక్కో కార్మికుడికి రూ.లక్షా 60 వేలు చెల్లించామని కేటీఆర్ తెలిపారు. సింగరేణిని, కార్మికులను ముఖ్యమంత్రి రేవంత్ వెన్నుపోటు పూడుస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. కార్మికుల రెక్కల కష్టాన్ని కాంగ్రెస్‌ సర్కార్‌ దోచుకుంటోందన్నారు. 33 శాతం వాటా ఇస్తున్నామని సీఎం తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి లాభాలు రూ.4701 కోట్లు అయితే 33 శాతం వాటా ఇచ్చామంటున్నారు. అలా అయితే, కార్మికులకు రూ.1551 కోట్లు బోనస్‌ ఇవ్వాలి. ఒక్కో కార్మికుడికి రూ.3.70 లక్షలు రావాలి.. కానీ, రూ.లక్షా 90 వేలు మాత్రమే ఇస్తున్నారని కేటీఆర్ వివరించారు.

16 శాతం మాత్రమే బోనస్ ఇస్తున్నామని కాంగ్రెస్‌ ఒప్పుకోవాలన్నారు. లేదంటే లక్షా 90వేలు కాదు.. రూ. 3.70 లక్షల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కేటీఆర్. సింగరేణి కార్మికుల వాటా తగ్గింపుపై గుర్తింపు సంఘం ఏఐసీయూసీ స్పందించాలన్నారు. కూనంనేని సాంబశివరావు తన అభిప్రాయం చెప్పాలన్నారు. వాటా పెంచాలని కార్మికులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసి ఒత్తిడి చేయాలన్నారు. సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ చెప్పారు.

Read Also: Janasena : 26న పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్న బాలినేని..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amrit Scheme Tenders
  • brs
  • congress
  • ktr
  • Minister Ponguleti Srinivas Reddy

Related News

Jeevan Reddy Brs

BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన 'ప్రజా ఆశీర్వాద సభ'లో పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన అధికారికంగా గులాబీ కండువా కప్పుకున్నారు. కేవలం జీవన్ రెడ్డి మాత్రమే కాకుండా, ఆయన వెంట సుమారు 40 మంది బలమైన అనుచర గణం

  • Harish Rao Kmm

    Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

  • Telangana Government Good N

    Disabled People : దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

Latest News

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

  • నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd