Konda Surekha: పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు
కొండ సురేఖ పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అడవులు మరియు ఎండోమెంట్స్ మంత్రిగా ఆమెకు రాష్ట్ర ప్ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈరోజు సచివాలయంలోని తన ఛాంబర్లో ఆమె కుటుంబ సభ్యులు,
- By Praveen Aluthuru Published Date - 04:42 PM, Sun - 17 December 23
Konda Surekha: కొండ సురేఖ పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అడవులు మరియు ఎండోమెంట్స్ మంత్రిగా ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈరోజు సచివాలయంలోని తన ఛాంబర్లో ఆమె కుటుంబ సభ్యులు, శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో కొండ సురేఖ బాధ్యతలు స్వీకరించారు. మంత్రి బాధ్యతలు స్వీకరించిన వెంటనే మానవ జంతు సంఘర్షణలకు గురైన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియాను పెంచడం, మానవ ప్రాణనష్టానికి పరిహారం మొత్తాన్ని 5 లక్షల నుంచి రూ. 10 లక్షలు పెంచడం కోసం మంత్రి మొదటి ఫైల్పై సంతకం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు, సూచనలు, నిబంధనలను త్వరలో విడుదల చేయనున్నారు. తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి వివిధ పండుగలు, కార్యక్రమాలకు ఏనుగులను తీసుకురావడానికి సంబంధించిన ఫైల్పై కూడా ఆమె సంతకం చేశారు.
అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రిగా నియమితులైనందుకు ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. అటవీ శాఖ అభివృద్ధి కోసం 100 శాతం కట్టుబడి ఉంటానని చెప్పారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటానని హామీ ఇచ్చారు. పర్యావరణ కాలుష్యంపై పోస్టర్లను విడుదల చేసిన మంత్రి.. కాలుష్య నియంత్రణకు, అడవులు, వన్యప్రాణులను రక్షించేందుకు సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు పిలుపునిచ్చారు. అనంతరం ఆమె అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజలతో మమేకమై ప్రజా సేవకులు”గా పని చేయాలని అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు.
Also Read: PDF MLC Shaik Sabji : అధికారిక లాంఛనాలతో ముగిసిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అంత్యక్రియలు
Related News
Big Shock To BRS : కాంగ్రెస్ లో చేరిన ఇంద్రకిరణ్ రెడ్డి
బిఆర్ఎస్ పార్టీ లో కీలక పదవి అనుభవించిన కీలక నేత , మాజీ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి..కొద్దీ సేపటి క్రితం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసారు. రాజీనామా అనంతరం గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు