HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kishan Reddy Demands Immediate Resignation Of Kcr

Kaleshwaram Project: కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలి: కిషన్ రెడ్డి

ప్రతిష్ఠాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్షం, అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

  • Author : Praveen Aluthuru Date : 04-11-2023 - 9:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kaleshwaram Project
Kaleshwaram Project

Kaleshwaram Project: ప్రతిష్ఠాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్షం, అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పైగా ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల కోట్ల ప్రజాధనం వృథా అయిందన్నారు కిషన్ రెడ్డి. ప్రపంచంలోనే అత్యున్నత మేధావి అని 80 వేల పుస్తకాలు చదివానని, దేశ రాజ్యాంగాన్ని తిరగరాస్తానని చెప్పిన కేసీఆర్ తెలంగాణ మేధావుల మాట వినకుండా ప్రాజెక్టు కట్టి లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు.

ఈరోజు కిషన్ రెడ్డి మేడిగడ్డ , అన్నారం బ్యారేజీలను బీజేపీ నేత లక్ష్మణ్‌, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి పరిశీలించారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో మేడిగడ్డ చేరుకున్న వారికి స్థానిక బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అక్కడి సిబ్బందితో మాట్లాడి మేడిగడ్డ బ్యారేజీ గురించి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీ నష్టానికి సీఎం కేసీఆర్‌ పూర్తి బాధ్యత వహించి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మేడిగడ్డ పిల్లర్లకు పగుళ్లు వచ్చిన విషయం తెలియగానే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాశామని, ఈ లేఖపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం స్పందించిందని తెలిపారు . అన్నారం బ్యారేజీ పరిస్థితి కూడా మేడిగడ్డలా ఉందని, ఇక్కడ ఒక్క టీఎంసీ నీరు కూడా నిల్వ ఉండదని కిషన్ రెడ్డి విమర్శించారు.

ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు . కాంగ్రెస్ ప్రభుత్వం అంచనాలను పూర్తిగా మార్చివేసి ప్రణాళిక లేకుండానే ప్రాజెక్టును నిర్మించారని ఆరోపించారు. కేసీఆర్‌ పోకడలతో ప్రాజెక్టు కట్టారని, ఇంజనీర్ల మాట వినకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారన్నారు. కేసీఆర్ వల్లే ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు ఉచ్చుగా మారింది. ప్రజాధనాన్ని వృధా చేసి నాసిరకం ప్రాజెక్టును నిర్మించారని మండిపడ్డారు. ఇప్పటి వరకు బ్యారేజీ నష్టంపై సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

Also Read: Vaibhav: తెలుగు, తమిళ భాషల్లో వైభవ్, పార్వతి నాయర్ జంటగా నటించిన ‘ఆలంబన’ విడుదల


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kaleshwaram project
  • kcr
  • kishan reddy
  • resignation
  • telangana

Related News

Restraint is needed on water disputes: CM Revanth Reddy

జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

జల వివాదాల విషయంలో కోర్టుల చుట్టూ తిరగకుండా, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకుని పరిష్కార మార్గాలు కనుగొనాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Sankranthi Toll Gate

    సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వాహనదారులకు బ్యాడ్ న్యూస్ !

  • Minister Konda Surekha and Seethakka meets KCR

    మహిళా మంత్రులకు కేసీఆర్‌ ఆత్మీయ పలకరింపు..పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కారం

  • PV Huzurabad JAC Leaders Demand Formation of District In name Of PV Narasimha Rao

    తెలంగాణ లో మరో జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధం.. పీవీ నరసింహారావు పేరు ఖరారు ?

  • Erravalli Farmhouse Seethakka, Konda Surekha,

    కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

Latest News

  • సంక్రాంతి సెలవుల ఎఫెక్ట్ : కిటకిటలాడుతున్న బస్టాండ్లు , రైల్వే స్టేషన్లు

  • వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

  • జియో ఐపీఓ: 2.5% వాటా విక్రయించే యోచనలో రిలయన్స్‌!

  • ఉక్రెయిన్ పై మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా

  • రోజూ అవిసె గింజల పొడి తింటే కలిగే లాభాలివే..!

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd