Tummala vs BRS : పూజకు పనికి రాని పువ్వు “పువ్వాడ” .. కేసీఆర్కి మంత్రి పదవి ఇప్పించింది తానేనన్న తుమ్మల
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. తుమ్మల మూల కుర్చుంటే మంత్రి
- By Prasad Published Date - 10:16 AM, Mon - 6 November 23
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. తుమ్మల మూల కుర్చుంటే మంత్రి పదవి ఇచ్చానని కేసీఆర్ అన్నారు. అయితే దీనికి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. జెండా కట్టలేని జిల్లాలో ఎంపీటీసీలు, సర్పంచ్ల దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు అందరిని పార్టీలోకి తీసుకువచ్చానన్నారు. పనుల కోసం, అభివృద్ధి కోసమే పార్టీ మారరని.. తన వ్యక్తిగ స్వార్థం కోసం పార్టీ మారలేదన్నారు. తాను పార్టీ మారితే సీఎం కేసీఆర్కు దిమ్మతిరిగిందన్నారు. చంద్రబాబు కేబినెట్లో కేసీఆర్ కి మంత్రి పదవి ఇప్పించింది తానేనన్నారు. ఫారెస్ట్ మంత్రి ఇస్తే అది వద్దంటే మళ్లీ వెళ్లి టన్స్పోర్ట్ మినిస్టర్ పదవి ఇప్పించానని తుమ్మల తెలిపారు. ఖమ్మం జిల్లాలో 25 ఏళ్ల క్రితమే అభివృద్ధి ఎంటో చూపించానని.. ఎవరు అభివృద్ధి చేశారో ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇటు ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్పై తుమ్మల ఫైర్ అయ్యారు. పువ్వాడ అజయ్ పూజకు పనికి రాని పువ్వంటూ వ్యాఖ్యానించారు. 25 ఏళ్ల క్రితమే సత్తుపల్లిలో డివైడర్ కట్టానని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి శిలాఫలకం మీద తన పేరు ఉంటుందన్నారు. మిషన్ కాకతీయలో ఖమ్మం జిల్లా ఫస్ట్లో నిలిచిందని.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా తానే ఇచ్చానన్నారు. కాంగ్రెస్ హయాంలో కూడా తాను ప్రభుత్వంపై పోరాడి అభివృద్ధి పనులు చేయించుకున్నానని తెలిపారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగు గంగా నుంచి నేటి భక్తరామదాసు ప్రాజెక్టు వరకు తన భాగస్వామ్యం ఉందన్నారు. పనులను కాంట్రాక్టర్లకు అమ్ముకున్న చరిత్ర పువ్వాడ అజయ్దేనన్నారు. అభివృద్ధి చేస్తే సీఎం కార్యక్రమానికి 300 రూపాయలు ఇచ్చి జనాల్ని తీసుకువచ్చారన్నారు. ఈ నెల 30వ తారీఖు ఖమ్మం ప్రజలు 14 అడుగుల గోతిలో పాతిపెడతారన్నారు.
Also Read: BRS : తుమ్మ ముళ్లు కావాల్నో, పువ్వాడ పువ్వులు కావాల్నో మీరే తేల్చుకోండి – కేసీఆర్
Related News
Rains Alert: చల్లని కబురు.. తెలంగాణలోని 14 జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 29న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.