KCR: కేసీఆర్ పొలంబాట.. 5న కరీంనగర్, రాజన్న-సిరిసిల్లలో పర్యటన
- By Balu J Published Date - 07:55 PM, Mon - 1 April 24
KCR: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మార్చి 31న ప్రారంభించిన ‘పొలం బాట’ రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ఏప్రిల్ 5న కరీంనగర్, రాజన్న-సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ ఏడాది అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులతో మాజీ ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. తన పర్యటనలో భాగంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి, వర్షాభావ పరిస్థితులను పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పాలనలో 100 రోజుల్లోనే తెలంగాణ వ్యాప్తంగా 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేసీఆర్ ఆదివారం ఆరోపించారు.
మార్చి 31న సూర్యాపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నాలుగు నెలలుగా మౌనం దాల్చాను. ఇప్పుడు లక్షల ఎకరాలు ఎండిపోతుంటే నేను ఖాళీగా కూర్చొలేను. మీరు (కాంగ్రెస్) డిసెంబర్ 9, 2023 నాటికి రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అది జరిగిందా? కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలోనే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు, నీటి కష్టాలు, కరెంటు కోతలను చూస్తోంది. ఈ దృశ్యానికి బాధ్యులెవరు?” రైతులకు ఎకరాకు రూ.25వేలు పంట నష్టపరిహారం చెల్లించే వరకు బీఆర్ఎస్ విశ్రమించేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
Related News
Raghunandan Rao : గల్లీలో.. ఢిల్లీలో లేని.. కారును గెలిపిస్తే మిగిలేది శూన్యమే: రఘునందన్ రావు
Raghunandan Rao:మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి ఎం రఘునందన్ రావు సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో మెదక్ పార్లమెంట్ జరిగిన కిసాన్ మోర్చా(kisan morcha) సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, రెవంత్రెడ్డిలపై విమర్శలు గుప్పించారు. గల్లీలో లేని ఢిల్లీలో లేని కారును గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యమేనని ఆయన అన్నారు. We’re now