HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr Meets Farmers In Jangama Suryapet District

KCR : నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి – కేసీఆర్ డిమాండ్

'రైతుల తరఫున మాట్లాడేవారు లేరనుకుంటున్నారా? మేమున్నాం. ప్రభుత్వం మెడలు వంచుతాం. లక్ష ఎకరాల్లో పంట పోయింది. ఈ మంత్రులు, సీఎం ఏం చేస్తున్నారు? ఎండిపోయిన పంటకు ఎకరాకు రూ. 25వేల నష్టపరిహారం ఇవ్వాల్సిందే. అప్పటి వరకు వేటాడుతాం. వెంటాడుతాం.

  • By Sudheer Published Date - 07:01 PM, Sun - 31 March 24
  • daily-hunt
Kcr Medigadda
Kcr Medigadda

బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) ఆదివారం పొలంబాట పట్టారు. రైతుకు బాసటగా నిలిచేందుకు, కాంగ్రెస్‌ పాలనలో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటించి ఎండిపోయిన పంట ను దగ్గర ఉండి పరిశీలించి , రైతుల కష్టాలను అడిగితెలుసుకున్నారు. పర్యటన అనంతరం నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఏర్పటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. ఎండిపోయిన పంటలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసారు. ‘రైతుల తరఫున మాట్లాడేవారు లేరనుకుంటున్నారా? మేమున్నాం. ప్రభుత్వం మెడలు వంచుతాం. లక్ష ఎకరాల్లో పంట పోయింది. ఈ మంత్రులు, సీఎం ఏం చేస్తున్నారు? ఎండిపోయిన పంటకు ఎకరాకు రూ. 25వేల నష్టపరిహారం ఇవ్వాల్సిందే. అప్పటి వరకు వేటాడుతాం. వెంటాడుతాం. ఎక్కడికక్కడ మిమ్మల్ని ప్రశ్నిస్తాం’ అని తేల్చిచెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

‘మేం పదేళ్లు రైతులను బ్రహ్మండంగా చూసుకున్నం. ఇప్పుడు వాళ్ల కండ్ల పొంటి నీళ్లు వస్తుంటే ఎట్ల చూడాలె. వాళ్లు బాధలు పడుతుంటే చూసి ఎట్ల ఊకోవాలె. ఇప్పుడే ఇట్లుంటే ముందుముందు ఎట్లుంటదని రైతులు భయాందోళన చెందుతున్నరు. అందుకే వాళ్లపక్షాన మేం నిలబడ్డం. డిసెంబర్‌ 9న రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తమన్నరు. డిసెంబర్‌ 9 పొయ్యి ఎన్నాళ్లయ్యింది..? ముఖ్యమంత్రి ఎక్కడున్నరు..? మీరు దొంగ హామీలు ఇచ్చి తప్పించుకోలేరు. మేం వెంటపడి తరుముతం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాక ఇడిసిపెట్టేది లేదు. బ్యాంకులోళ్లు రైతుల ముక్కుపిండి రుణాలు వసూలు చేస్తున్నరు. మీకు బాధ లేదా..? కనీసం రైతుల దుస్థితి గురించి ఆలోచనైనా చేస్తున్నరా..? రైతుల పక్షాన ఎవడు మాట్లాడెటోడు లేడు, అడిగేటోడు లేడని మీరు అనుకుంటున్నరా..?’ అని కేసీఆర్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోవడానికి కారణం మీరు. కరెంటు లో వోల్టేజ్‌ సరఫరాకు కారణం మీరు. మీకంటే ముందు ఎనిమిదేండ్లు మేం బ్రహ్మాండంగా కరెంటు ఇచ్చినం. ఎనిమిదేండ్లు ఇచ్చిన కరెంటు ఇప్పుడెట్ల మాయమైంది’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 100 రోజుల వ్యవధిలోనే రైతులు ఏడ్చే పరిస్థితికి వెళ్తారని తాను అనుకోలేదని అన్నారు. తమకు అందిన సమాచారం ప్రకారం 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితికి ప్రభుత్వ వైఖరి కారణమని దుయ్యబట్టారు. అనేక జిల్లాల్లో పంటలు ఎండిపోయాయని దుయ్యబట్టారు. నేను రైతులకు చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నా. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీ కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ రణరంగమైనా సృష్టిస్తది. ప్రధాన ప్రతిపక్షంగా మీరు మాకు బాధ్యత ఇచ్చారు. కానీ ఎమ్మటే మాట్లాడితే ఓర్వలేని తనం అంటరని ఓపిక పట్టిన. ఇప్పుడు నాలుగో నెల వచ్చింది. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నయ్‌ కాబట్టి చూస్తూ ఊరుకోలేక వచ్చిన’ అన్నారు. అదేవిధంగా వాగ్ధానలు ఎగవెడితే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘మీరు వాగ్ధానాలను ఎగవెట్టి ఊరేగుదాం అనుకుంటున్నరా..? వాగ్ధానాలు ఎగవెడితే బిడ్డా నిద్ర గూడ పోనియ్యం చెప్తున్నా’ అని కేసీఆర్‌ హెచ్చరించారు.

Read Also : TDP : టీడీపీ మళ్లీ తన కోటను కైవసం చేసుకుంటుందా..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • kcr
  • KCR press meet

Related News

Maganti Sunitha

Maganti Sunitha: మాగంటి సునీత‌కు కేటీఆర్ మద్దతు వెనక రియల్ లైఫ్ డ్రామా?

గోపీనాథ్ మరణానంతరం కేటీఆర్ అద్భుతమైన రాజకీయ స్క్రిప్ట్ రాశారనే ప్రచారం జరిగింది. పి.జె.ఆర్. కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వకుండా 'సానుభూతి కార్డ్' పైనే ఉపఎన్నికల భవిష్యత్తును నిర్ణయించారు.

  • Minister Uttam

    Minister Uttam: అభివృద్ధి, సంక్షేమం కోసం నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వండి: మంత్రి ఉత్తమ్

  • Jublihils Campign

    Jubilee Hills By Election : నగరవాసులకు కొత్త కష్టాలు

  • KCR appearance before Kaleshwaram Commission postponed

    KCR : కేసీఆర్ ను అరెస్టు చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు – కిషన్ రెడ్డి

  • Congress

    Congress: సీఎం రేవంత్- అజారుద్దీన్‌ల వివాదంపై కాంగ్రెస్ క్లారిటీ!

Latest News

  • International Airport: ఢిల్లీ తర్వాత నేపాల్‌ విమానయానంలోనూ సాంకేతిక లోపం!

  • Blood Pressure: రాత్రిపూట రక్తపోటు ఎందుకు పెరుగుతుంది?

  • Zodiac Signs: కర్ణుడి ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా ఈ రాశుల‌వారిలోనే ఉంటాయ‌ట‌!

  • Parliament Winter Session: పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు.. డిసెంబ‌ర్ 1 నుంచి హీట్ పెంచ‌బోతున్నాయా?

  • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

Trending News

    • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

    • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

    • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

    • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd