HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr Expresses Shock Announces Ex Gratia For Karnataka Bus Accident Victims

CM KCR : కర్ణాటక మృతుల కుటుంబాలకు కేసీఆర్ ఎక్స్ గ్రేషియా!

హైదరాబాద్‌కు చెందిన ఏడుగురి ప్రాణాలను బలిగొన్న ఘోర రోడ్డు ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

  • Author : Balu J Date : 03-06-2022 - 9:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr
Kcr

కర్ణాటకలోని కలబురగి జిల్లాలో శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన ఏడుగురి ప్రాణాలను బలిగొన్న ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు కమలాపూర్ సమీపంలో శుక్రవారం ఉదయం డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడగా, వారిని గుల్బర్గాలోని ఆసుపత్రికి తరలించారు. 8 మంది చనిపోయినట్టు సమాచారం. కేసీఆర్ సంతాపం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారం ప్రకటించారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. మృతదేహాలను తరలించడానికి, గాయపడిన వారికి సాధ్యమైనంత చికిత్స చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ యాదవ్‌లను ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతకుముందు, సంఘటన గురించి తెలిసిన వెంటనే, ముఖ్యమంత్రి ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కర్ణాటక ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

కర్నాటక రాష్ట్రంలోని కలబురగి బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ. 3 లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50 వేల పరిహారాన్ని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.

— Telangana CMO (@TelanganaCMO) June 3, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • Exgratia
  • karnataka
  • road accident

Related News

    Latest News

    • అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’..ఎప్పటినుంచంటే?

    • ఐసిస్‌పై అమెరికా మెరుపు దాడులు: ఉగ్రవాదానికి గట్టి హెచ్చరిక

    • మూత్రపిండాల ప్రాధాన్యత ఏమిటి?..సమస్యలను సూచించే ముందస్తు లక్షణాలివే..!

    • స్త్రీలు గాజులు ధరిస్తున్నారా? ..మరి ఈ నియమాలు తెలుసా?

    • ట్రంప్ దెబ్బకు తమిళనాడు లో 30 లక్షల ఉద్యోగాలకు ముప్పు!

    Trending News

      • సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

      • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

      • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

      • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

      • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd