TRS MPs: తగ్గేదేలే…కేంద్రంతో ఇక టీఆర్ఎస్ తాడోపేడో
పార్లమెంటు సమావేశాల సాక్షిగా కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమయింది. ఆ పార్టీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు.
- By Naresh Kumar Published Date - 04:10 PM, Sun - 17 July 22
పార్లమెంటు సమావేశాల సాక్షిగా కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమయింది. ఆ పార్టీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్లో పోరాడాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. పార్లమెంటులో నిరసనలు తెలియజేయాలని మరియు అనేక కీలక అంశాలను లేవనెత్తాలని సూచించారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక అడ్డంకులు సృష్టిస్తున్న కేంద్రాన్ని పార్లమెంట్లో ఎండగట్టాలని ఎంపీలకు ముఖ్యమంత్రి చెప్పినట్టు తెలిసింది. ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్రానికి అన్యాయం చేయడంలో కేంద్రాన్ని దోషిగా నిలబెట్టాలని, ప్రజల ఆకాంక్షలను కూడా ప్రతిబింబించాలని ఎంపీలకు సూచించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బందులకు గురి చేయడాన్ని పార్లమెంట్ వేదికగా ప్రస్తావించాలని కెసిఆర్ ప్రత్యేకంగా చెప్పినట్టు తెలిసింది. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న తెలంగాణపై కేంద్రప్రభుత్వ ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేయాలని కూడా సూచించినట్టు తెలుస్తోంది. కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్న ఇతర పార్టీల ఎంపీలను కూడా టీఆర్ఎస్తో చేర్చుకోవాలని ముఖ్యమంత్రి టిఆర్ఎస్ ఎంపీలతో స్పష్టంగా చెప్పారు. ఇటీవలే విలేఖరుల సమావేశంలో మోడీ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించిన కేసీఅర్ అదే స్ఫూర్తిని కొనసాగించాలని తన పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో ఇవాళ జరిగిన అఖిల పక్ష సమావేశానికి కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరూ హాజరు కాలేదు.
Related News
Delhi Lok Sabha Elections 2024: ఆప్ కి ఓటు వేయనున్న రాహుల్ గాంధీ
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తారని, రెండు మిత్రపక్షాల మధ్య బలమైన బంధానికి గుర్తుగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ అభ్యర్థికి నేను ఓటేస్తానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.