CM KCR: ఎర్రవల్లి ఫాం హౌజ్లో ప్రజల్ని కలిసిన మాజీ సీఎం కేసీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేతిలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు బుధవారం తొలిసారిగా ప్రజలని కలిశారు. సిద్దిపేట జిల్లా చింతమడకలోని తన స్వగ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను పలకరించేందుకు
- By Praveen Aluthuru Published Date - 10:13 PM, Wed - 6 December 23
CM KCR: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేతిలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు బుధవారం తొలిసారిగా ప్రజలని కలిశారు. సిద్దిపేట జిల్లా చింతమడకలోని తన స్వగ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను పలకరించేందుకు ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చారు. మధ్యాహ్నం కేసీఆర్ను కలిసేందుకు 9 బస్సుల్లో 540 మంది ఎర్రవెల్లి ఫాం హౌస్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బయటికి వచ్చిన కేసీఆర్ తన సొంతూరు ప్రజలు అందరికీ అభివాదం చేశారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాగానే జనం ‘సీఎం కేసీఆర్’ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ తో పాటు మేనల్లుడు, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు కూడా ఉన్నాడు.
ఆయన మీద ఉండే అభిమానం ఎప్పటికీ అలానే ఉంటుంది.#KCR pic.twitter.com/pfSMn7i1UL
— AR (@AshokReddyNLG) December 6, 2023
కేసీఆర్ ఈనెల 30న సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడకలో పర్యటించి ఓటు వేశారు. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడ్డాయి. 119 మంది సభ్యుల అసెంబ్లీలో 64 స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది. బీఆర్ఎస్ 39 సీట్లు గెలుచుకుంది. డిసెంబర్ 4న కేసీఆర్ తన ఫామ్హౌస్లో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.
Also Read: Ghee For Health: చలికాలంలో రోజు ఒక స్పూన్ నెయ్యి తింటే ఏం జరుగుతుంది తెలుసా?
Related News
Harish Rao: రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది : మాజీ మంత్రి హరీశ్ రావు
Harish Rao: కరీంనగర్లో ప్రెస్ మీట్ మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోతే పదవి పోతుందనే భయం స్పష్టంగా కనిపిస్తోందని హరీశ్ రావు అన్నారు. దేవుళ్లపై ఒట్టు పెట్టుకుంటూ రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ సెంటిమెంటల్ మాటలు మాట్లాడుతున్నాడని, ఎన్నికల హమీల గురించి, నాలుగు నెలల పాలన గురించి మాట్లాడడం లేదని హరీశ�