CM KCR Election Campaign : ఎన్నికల సమరానికి ‘సై’ అంటున్న కేసీఆర్..17 రోజుల పర్యటనకు షెడ్యూల్ ఫిక్స్
ఎన్నికల సమరానికి గులాబీ బాస్ సిద్ధం (KCR) అవుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా 17 రోజులు వరుస సభలతో ప్రత్యర్థుల ఫై మాటల తూటాలు పేల్చేందుకు రెడీ అయ్యారు.
- By Sudheer Published Date - 10:40 AM, Wed - 11 October 23
ఎన్నికల సమరానికి గులాబీ బాస్ సిద్ధం (CM KCR) అవుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా 17 రోజులు వరుస సభల (KCR Public Meetings)తో ప్రత్యర్థుల ఫై మాటల తూటాలు పేల్చేందుకు రెడీ అయ్యారు. నవంబర్ 30 న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (TS assembly elections 2023) జరగబోతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు పట్టుమని రెండు నెలల సమయం కూడా లేకపోవడంతో అన్ని పార్టీల నేతలు ఎన్నికల సమరానికి సిద్ధం అవుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలని గులాబీ బాస్ ప్లాన్ చేస్తుంటే..ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది మనం..అలాంటి తెలంగాణ లో ఈసారి గెలిచి తీరాలని కాంగ్రెస్ (Congress) చూస్తుంది. బిజెపి (BJP) సైతం ఈసారి తెలంగాణ (Telangana) లో బోణి కొట్టాలని చూస్తుంది. ఇలా ఈ మూడు ప్రధాన పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం తహతలాడుతున్నాయి.
ఈ మూడు పార్టీలలో గులాబీ పార్టీ దూకుడు మీద ఉంది. ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించి ఎప్పటికి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టించారు కేసీఆర్. ఇక ఇప్పుడు ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు సిద్ధం అయ్యారు. 17 రోజులు 42 సభలతో గులాబీ సత్తా (KCR Election Campaign Schedule) చాటబోతున్నారు. సంక్షేమ పధకాలు , అభివృద్ధే ప్రధాన అస్ర్తాలుగా సీఎం కేసీఆర్ ఎన్నికల సమరాంగణంలోకి అడుగుపెట్టబోతున్నారు. రోజుకు రెండు, మూడు సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు. అక్టోబర్ 15న హుస్నాబాద్ తో కేసీఆర్ ఎన్నికల సమర శంఖారావం పూరించనున్నారు. 2018లో కూడా ఇక్కడ నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
హూస్నాబాద్ (KCR Husnabad Public Meeting) లో భారీ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మంత్రి హరీష్ రావ్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దీని తర్వాత అక్టోబర్ 16న జనగామ, భువనగిరి సభలకు….17న సిరిసిల్ల, సిద్ధిపేట సభల్లో పాల్గొంటారు. ఆ తర్వాతి రోజు 18న జడ్చర్ల, మేడ్చల్లో సభల్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు. దీని తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారు కేసీఆర్. మళ్ళీ అక్టోబర్ 26నుంచి వరుసగా సభల్లో పాల్గొంటారు. 26న అచ్చంపేట, నాగర్ కర్నూల్, మునుగోడు…27న పాలేరు, స్టేషన్ ఘన్ పూర్, 29న కోదాడ, తుంగతుర్తి, ఆలేరు…30న జుక్కల్,బాన్సువాడ, నారాయణ ఖేడ్, 31న హుజూరాబాద్, మిర్యాలగూడ, దేవరకొండల్లో సభల్లో పాల్గొంటారు.
ఇక నవంబర్ లో 1న సత్తుపల్లి, ఇల్లెందు…2న నిర్మల్, బాల్కొండ,ధర్మపురి…3న భైంసా, ఆర్మూర్, కోరుట్ల….5న కొత్తగూడెం, ఖమ్మం….6న గద్వాల్, మఖ్తల్, నారాయణ పేట…7న చెన్నూరు,మంథని, పెద్దపల్లి….8న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి సభల్లో పాల్గొంటారు. నవంబర్ 9న రెండు నియోజకవర్గాలు గజ్వేల్ , కామారెడ్డి లలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 9వ తేదీ ఉదయం సిద్ధిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత మధ్యాహ్నం 2గంటలకు గజ్వేల్లో మొదటి నామినేషన్ ను వేసి అక్కడ నుంచి కామారెడ్డి వెళ్ళి అక్కడ కూడా నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ వేసిన తర్వాత కామారెడ్డి భారీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడతారు. ఇలా 17 రోజులు కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు.
Read Also : Quit Meta Job: ఏడాదికి రూ.3 కోట్ల జీతం.. అయినా ఉద్యోగం మానేశాడు.. ఎందుకో తెలుసా..?
Related News
Lok Polls : సింగరేణిని ముంచేందుకు రేవంత్ కుట్రలు – కేసీఆర్
మంచిగ ఉన్న సింగరేణిని ఒకప్పుడు ముంచిన కాంగ్రెస్ .. ఇప్పుడు మరోసారి మోడీతో కలిసి రేవంత్ రెడ్డి సింగరేణిని ముంచేందుకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు