Uppal Stadium: ఉప్పల్ స్టేడియం ఇలా.. క్రికెట్ చూసేదెలా!
హైదరాబాద్ కు ట్వీ20 ఫీవర్ పట్టుకుంది. ఉప్పల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగబోతోంది.
- By Balu J Published Date - 03:51 PM, Sat - 24 September 22
హైదరాబాద్ కు ట్వీ20 ఫీవర్ పట్టుకుంది. ఉప్పల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగబోతోంది. ఈ మ్యాచ్ తో ట్వీ20 సిరీస్ ఫలితం తేలనుండటం.. దాదాపు మూడేళ్ల తర్వాత హైదరాబాద్ లో మ్యాచ్ జరుగబోతుండటం అంతటా ఆసక్తి నెలకొంది. ఈ నేేపథ్యంలో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈనెల 25న జరగాల్సిన భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్కు భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. టికెట్ల అమ్మకాల విషయంలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని, స్టేడియం వద్ద పగడ్బందీ ఏర్పాట్లు చేశారు.
ఈ ఇంటర్నేషనల్ మ్యాచ్ కు 40 వేల మంది ప్రేక్షకులు వస్తారని అంచనా. వీరిని కంట్రోల్ చేసేందుకు దాదాపు 2500 మంది పోలీసులు రంగంలోకి దిగనున్నారు. ఉప్పల్ స్టేడియంలో హెచ్సీఏ ఆధ్వర్యంలో ఈ ఆదివారమే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఒకవైపు ప్రేక్షకులు ఆసక్తిగా ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తుండగా, మరోవైపు స్టేడియంలోని అసౌకర్యాలు ప్రేక్షకులను వెక్కిరిస్తున్నాయి.
ఈ మ్యాచ్ను నెల రోజుల కిందటే ఖరారు చేసినా స్టేడియంలో పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టున్నాయి. ప్రేక్షకులు కూర్చొనేందుకు వీల్లేకుండా అక్కడక్కడ కుర్చీలు విరిగి పడిపోయాయి. ఇదేం స్టేడియం రా బాబోయ్ అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి స్టేడియంలో మ్యాచ్ చూసే బదులు టీవీలో చూడటం బెటర్ అని అభిప్రాయపడుతున్నారు కొందరు క్రికెట్ లవర్స్. కాగా ఈ మ్యాచ్ కోసం కేటాయించిన టికెట్స్ బ్లాక్ లో అమ్ముకున్నట్టు పెద్ద ఎత్తున విమర్శలొస్తున్న విషయం తెలిసిందే. క్రీడాభిమానులు అజరుద్దీన్ వ్యవహరంపై మండిపడుతున్నారు.
Related News
Congress ‘Special Manifesto’ : తెలంగాణ కోసం భారీ హామీలు ప్రకటించిన కాంగ్రెస్
గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు