HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Huge Land Scam In Metro Rail Expansion Bjp Lakshman Fight On Kcr Benamis

Metro Rail : మెట్రో విస్త‌ర‌ణ‌లో భారీ `భూ` స్కామ్‌! బినామీల‌పై బీజేపీ ఆగం!

మెట్రో రైలు(Metro Rail) విడ‌త‌వారీగా నిర్మాణం చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం

  • Author : CS Rao Date : 19-12-2022 - 5:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr Metro
Kcr Metro

మెట్రో రైలు(Metro Rail) విడ‌త‌ల వారీగా నిర్మాణం చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక భూ స్కామ్(Land scam) ఉంద‌ని బీజేపీ చెబుతోంది. ప్రైవేట్ భూస్వాములకు లబ్ధి చేకూర్చేందుకే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎయిర్‌పోర్ట్ మెట్రో రైలు(Metro Rail) మార్గాన్ని మార్చారని బిజెపి రాజ్యసభ సభ్యుడు, ఒబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో జ‌రుగుతోన్న భూ స్కామ్(Land scam) ల‌కు అడ్డు అదుపు లేకుండా పోతుంద‌ని క‌మ‌ల‌నాథుల అభిప్రాయం. ఇప్ప‌టికే హైద‌రాబాద్ చుట్టు ప‌క్క‌ల సీఎం కేసీఆర్ అండ్ బ్యాచ్ కొన్ని వేల ఎక‌రాల ల్యాండ్ బ్యాంకును క‌లిగి ఉన్నార‌ని ఆరోప‌ణ‌లు అనేకం. వాటికి ధ‌ర‌లు పెంచుకోవ‌డానికి మెట్రో (Metro Rail) ప్రాజెక్టును విస్త‌రిస్తున్నార‌ని బీజేపీ చెబుతోంది.

ప్ర‌భుత్వం భూముల‌ను కేసీఆర్ స‌ర్కార్ త‌ర‌చూ విక్ర‌యిస్తోంది. అంతేకాదు, అసైన్డ్ భూముల‌ను ప్ర‌భుత్వ ఆధీనంలోకి తీసుకుంటుంది. ల‌బ్దిదారుల‌కు ఇవ్వ‌కుండా ప్ర‌భుత్వం కిరికిరి చేస్తోంద‌ని ల‌క్ష్మ‌ణ్ ఆరోపించారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో భూముల‌ను కేసీఆర్ బినామీలు పెద్ద ఎత్తున కొనుగోలు చేశార‌ని చాలా కాలంగా వినిపిస్తోన్న ఆరోప‌ణ‌లు. సామాన్యుల ప్రయోజ‌నాల‌ను పక్క‌న‌బెట్టి రియ‌ల్డ‌ర్లు, ఎంఐఎం కు అనుకూలంగా మెట్రో రైలు మార్గాన్ని 16 కి.మీ నుండి 32 కి.మీకి మార్చింద‌ని ల‌క్ష్మ‌ణ్ చెబుతున్నారు. మెట్రో రైలుకు 100 శాతం నిధులపై కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని వివ‌రించారు. ఉద్యోగుల‌కు స‌కాలంలో జీతాలు ఇవ్వ‌లేని కేసీఆర్ మెట్రో విస్త‌ర‌ణ‌కు ఉప‌క్ర‌మించ‌డం వెనుక బినామీ ఆస్తుల‌ను పెంచ‌డం కోస‌మేనంటూ బీజేపీ ఆరోపిస్తోంది.

జ‌మిలి ఎన్నిక‌లు

లోక్ స‌భ , అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఒకేసారి పెట్టాల‌ని బీజేపీ తొలి నుంచి ఆలోచిస్తోంది. దేశంలో జ‌మిలి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డం ద్వార ప్ర‌జాధ‌నాన్ని కాపాడాల‌ని క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు వివిధ పార్టీల నేత‌ల‌తో ప్ర‌ధాని మోడీ సంప్ర‌దింపులు జ‌రిపారు. కానీ, జ‌మ‌లి ఎన్నిక‌లు పెట్ట‌డానికి అనువైన ప‌రిస్థితులు రాలేదు. అందుకోసం బీజేపీ ప్ర‌య‌త్నం చేస్తుందని ఆ పార్టీ కేంద్ర బోర్డు మెంబ‌ర్, ఎంపీ ల‌క్ష్మ‌ణ్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల‌కు ఎప్పుడు అనేది ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ణ‌యిస్తుంద‌ని ల‌క్ష్మ‌ణ్ అన్నారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌తో పాటు తెలంగాణ‌కు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఉంటాయ‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ ఎన్నిక‌ల క‌మిష‌న్ సీఎం కేసీఆర్ చేతిలో ఉండ‌ద‌న్నారు. అసెంబ్లీని ర‌ద్దు చేసే వ‌ర‌కు మాత్ర‌మే ఆయ‌న ప‌రిధిలో ఉంటుంద‌ని గుర్తు చేశారు. ఆ త‌రువాత ఎన్నిక‌ల‌ను ఎప్పుడు పెట్టాలి? అనేది కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ణ‌యిస్తుంద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. అంటే, క‌ర్ణాట‌క‌తో పాటుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు ఉండే అవ‌కాశం లేద‌ని గ్ర‌హించొచ్చు.

డ‌బుల్ ఇంజ‌న్

డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ రాష్ట్రాల‌ను బాగు చేయ‌గ‌ల‌ద‌ని బీజేపీ చెబుతోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆ పార్టీ వినిపించే స్లోగ‌న్ డబుల్ ఇంజ‌న్ స‌ర్కార్‌. రాబోవు ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లోనూ అదే నినాదాన్ని బీజేపీ అందుకోనుంది. అందుకే, ఇప్ప‌టి నుంచే ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం కేసీఆర్ కేంద్రంతో స‌ఖ్య‌త‌గా లేక‌పోవ‌డాన్ని ల‌క్ష్మ‌ణ్ గుర్తు చేస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వంతో ఘ‌ర్ష‌ణ వైఖ‌రి మంచిది కాద‌ని హిత‌వు ప‌లికారు. ప్రొటోకాల్ ప్ర‌కారం సీఎం కేసీఆర్ న‌డుచుకోవాల‌ని సూచించారు. ఇటీవ‌ల ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కేసీఆర్ మొఖం చాటేయ‌డం నుంచి అసెంబ్లీ స‌మావేశాల్లో ప్రారంభోప‌న్యాసం గ‌వ‌ర్న‌ర్ కు లేకుండా చేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు.

Also Read : Metro: మెట్రో సెకండ్ ఫేజ్‌కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • cm kcr
  • Hyderabad Metro Rail
  • land scam

Related News

Pawan Janasena2

జనసేనతో పొత్తు అవసరం లేదు – బీజేపీ స్పష్టం

మున్సిపల్ ఎన్నికల్లో జనసేనతో BJPకి పొత్తు అవసరం లేదని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు. APలో పరిణామాల ఆధారంగానే కూటమి ఏర్పాటైందని, ఇక్కడ తాము బలంగా ఉన్నట్లు

    Latest News

    • పిల్ల‌ల‌ని ఈ స‌మ‌యాల్లో అస్స‌లు తిట్ట‌కూడ‌ద‌ట‌!

    • ఏపీ ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు

    • ఈ వారం సంక్రాంతికి ఓటీటీలో సందడి చేసే సినిమాలు

    • జనగామ జిల్లాను రద్దు చేస్తే , అగ్నిగుండమే ప్రభుత్వానికి పల్లా హెచ్చరిక

    • టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. రూ. 5.59 లక్షల ప్రారంభ ధరతో అదిరిపోయే ఫీచర్లు!

    Trending News

      • ఐపీఎల్ 2026కు ముందు భార‌త క్రికెట‌ర్‌ రిటైర్మెంట్!

      • ప్ర‌యాణికుల కోసం రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం..!

      • విరాట్ కోహ్లీకి గ‌ర్వం ఉందా? ర‌హానే స‌మాధానం ఇదే!

      • 60,000 ఏళ్ల క్రితం నాటి బాణాలు ల‌భ్యం!

      • బంగ్లాదేశ్‌కు భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd