HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >High Court Says No Stay On Ghosh Commission Report On Kaleshwaram Irregularities

Telangana : కాళేశ్వరం అవకతవకలపై ఘోష్ కమిషన్ నివేదికకు స్టే లేదన్న హైకోర్టు

ఈ నివేదికపై తక్షణంగా స్టే ఇవ్వలేమని స్పష్టంగా పేర్కొంది. ఈ కేసులో పిటిషనర్‌గా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం కలిగిన కీలక పదవుల్లో ఉన్నారు.

  • By Latha Suma Published Date - 01:17 PM, Wed - 3 September 25
  • daily-hunt
High Court says no stay on Ghosh Commission report on Kaleshwaram irregularities
High Court says no stay on Ghosh Commission report on Kaleshwaram irregularities

Telangana : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై న్యాయమూర్తి పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ రూపొందించిన నివేదికపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ నివేదికపై తక్షణంగా స్టే ఇవ్వలేమని స్పష్టంగా పేర్కొంది. ఈ కేసులో పిటిషనర్‌గా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం కలిగిన కీలక పదవుల్లో ఉన్నారు. ఆయన తన పిటిషన్‌లో కమిషన్ తుది నివేదిక తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆరోపించారు. విచారణ సమయంలో కమిషన్ తనను కేవలం ఒక సాక్షిగా మాత్రమే పిలిచి, తుది నివేదికలో మాత్రం ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు.

Read Also: Kavitha Press Meet : హరీష్ రావు …రేవంత్ కాళ్లు పట్టుకొని సరెండర్ అయ్యారు – కవిత

ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాల్సిందిగా జోషి అభ్యర్థించగా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న తర్వాత, నివేదికపై తక్షణ స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాకుండా, ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఎస్కే జోషికి ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 11న జరపాలని నిర్ణయించింది. విచారణలో న్యాయస్థానం కీలకంగా “మీకు ఈ నివేదిక ఎలా లభించింది?” అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. సాధారణంగా గోప్యంగా ఉండాల్సిన నివేదిక మీడియా గదిలో ఎందుకు ప్రస్తావించబడిందన్న కోణాన్ని కూడా పరిగణలోకి తీసుకుంది.

జోషి తన పిటిషన్‌లో పేర్కొన్న ప్రకారం, కమిషన్ తుది నివేదిక తయారు చేసే ముందు తనకు నోటీసు ఇవ్వలేదని, తన వాదనను వినే అవకాశం కల్పించకుండా క్రాస్ ఎగ్జామినేషన్ లేకుండానే తుది అభిప్రాయాలను నివేదికలో పొందుపరచడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. దీంతో, ప్రభుత్వం ఈ నివేదిక ఆధారంగా తనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇక, ఈ నివేదికలోని అంశాలను జులై 31న మీడియా సమావేశంలో ప్రభుత్వం ప్రకటించిందని జోషి అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటన తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసిందని, తనపై అనవసరంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తేలా చేసినట్టు తెలిపారు. కమిషన్ నివేదిక గోప్యంగా ఉండాల్సిన సమయంలోనే దాని సమాచారం బహిర్గతమైందని, ఇది అధికార పరమైన విచారణల నైతిక విలువలను కించపరిచేలా ఉందన్న అభిప్రాయాలు పలువురు న్యాయవాదుల నుంచి వ్యక్తమయ్యాయి. మరి, ఈ అంశంపై హైకోర్టు తుది తీర్పు ఎలా ఉండనుందన్నది సెప్టెంబర్ 11న జరగనున్న తదుపరి విచారణలో వెల్లడవుతుంది.

Read Also: Kavitha : కవిత సంచలన వ్యాఖ్యలు..నాపై దుష్ప్రచారం, బీసీల కోసం పోరాడినందుకే సస్పెండ్..!

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ghosh Commission Report
  • High Court says no stay
  • kaleshwaram project
  • Kaleshwaram project irregularities
  • Stay
  • Telangana High Court

Related News

KCR values ​​the party more than his family.. Mallareddy's response to Kavitha's suspension

Malla Reddy : కేసీఆర్‌కు కుటుంబం కన్నా పార్టీ మిన్న.. కవిత సస్పెన్షన్‌పై మల్లారెడ్డి స్పందన

కుటుంబ బంధాలను పక్కన పెట్టి పార్టీ పట్ల విధేయత చూపడమే నిజమైన నాయకత్వ లక్షణమని, ఈ చర్యతో అది మరింత స్పష్టమైందని మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు.

  • Kavitha

    Kavitha : కవిత సంచలన వ్యాఖ్యలు..నాపై దుష్ప్రచారం, బీసీల కోసం పోరాడినందుకే సస్పెండ్..!

  • Kavitha suspended from BRS

    BIG BREAKING: BRS నుంచి కవిత సస్పెండ్

  • Relief for KCR and Harish Rao.. High Court says no action based on Kaleshwaram report

    TG High Court : కేసీఆర్, హరీశ్ రావులకు ఊరట..కాళేశ్వరం నివేదిక ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్టు

  • Kaleshwaram issue reaches Delhi.. Telangana government writes to the Center

    Kaleshwaram Project : ఢిల్లీకి చేరిన కాళేశ్వరం వ్యవహారం..కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ

Latest News

  • Wonderful : 5.2 కేజీలతో బాలభీముడు పుట్టాడు..ఎక్కడో తెలుసా..?

  • Trump : జపాన్ పై సుంకం 25 నుంచి 15 శాతానికి తగ్గింపు

  • Ajit Pawar : వివాదంలో అజిత్‌ పవార్‌.. మహిళా ఐపీఎస్ అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు

  • DJ Sound : DJ సౌండ్ తో ప్రాణాలు పోతాయా?

  • Accident : శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి

Trending News

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

    • GST Rates: జీఎస్టీ 2.0.. ఏయే వ‌స్తువులు త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd