HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >High Court Says No Stay On Ghosh Commission Report On Kaleshwaram Irregularities

Telangana : కాళేశ్వరం అవకతవకలపై ఘోష్ కమిషన్ నివేదికకు స్టే లేదన్న హైకోర్టు

ఈ నివేదికపై తక్షణంగా స్టే ఇవ్వలేమని స్పష్టంగా పేర్కొంది. ఈ కేసులో పిటిషనర్‌గా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం కలిగిన కీలక పదవుల్లో ఉన్నారు.

  • By Latha Suma Published Date - 01:17 PM, Wed - 3 September 25
  • daily-hunt
High Court says no stay on Ghosh Commission report on Kaleshwaram irregularities
High Court says no stay on Ghosh Commission report on Kaleshwaram irregularities

Telangana : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై న్యాయమూర్తి పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ రూపొందించిన నివేదికపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ నివేదికపై తక్షణంగా స్టే ఇవ్వలేమని స్పష్టంగా పేర్కొంది. ఈ కేసులో పిటిషనర్‌గా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం కలిగిన కీలక పదవుల్లో ఉన్నారు. ఆయన తన పిటిషన్‌లో కమిషన్ తుది నివేదిక తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆరోపించారు. విచారణ సమయంలో కమిషన్ తనను కేవలం ఒక సాక్షిగా మాత్రమే పిలిచి, తుది నివేదికలో మాత్రం ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు.

Read Also: Kavitha Press Meet : హరీష్ రావు …రేవంత్ కాళ్లు పట్టుకొని సరెండర్ అయ్యారు – కవిత

ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాల్సిందిగా జోషి అభ్యర్థించగా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న తర్వాత, నివేదికపై తక్షణ స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాకుండా, ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఎస్కే జోషికి ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 11న జరపాలని నిర్ణయించింది. విచారణలో న్యాయస్థానం కీలకంగా “మీకు ఈ నివేదిక ఎలా లభించింది?” అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. సాధారణంగా గోప్యంగా ఉండాల్సిన నివేదిక మీడియా గదిలో ఎందుకు ప్రస్తావించబడిందన్న కోణాన్ని కూడా పరిగణలోకి తీసుకుంది.

జోషి తన పిటిషన్‌లో పేర్కొన్న ప్రకారం, కమిషన్ తుది నివేదిక తయారు చేసే ముందు తనకు నోటీసు ఇవ్వలేదని, తన వాదనను వినే అవకాశం కల్పించకుండా క్రాస్ ఎగ్జామినేషన్ లేకుండానే తుది అభిప్రాయాలను నివేదికలో పొందుపరచడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. దీంతో, ప్రభుత్వం ఈ నివేదిక ఆధారంగా తనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇక, ఈ నివేదికలోని అంశాలను జులై 31న మీడియా సమావేశంలో ప్రభుత్వం ప్రకటించిందని జోషి అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటన తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసిందని, తనపై అనవసరంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తేలా చేసినట్టు తెలిపారు. కమిషన్ నివేదిక గోప్యంగా ఉండాల్సిన సమయంలోనే దాని సమాచారం బహిర్గతమైందని, ఇది అధికార పరమైన విచారణల నైతిక విలువలను కించపరిచేలా ఉందన్న అభిప్రాయాలు పలువురు న్యాయవాదుల నుంచి వ్యక్తమయ్యాయి. మరి, ఈ అంశంపై హైకోర్టు తుది తీర్పు ఎలా ఉండనుందన్నది సెప్టెంబర్ 11న జరగనున్న తదుపరి విచారణలో వెల్లడవుతుంది.

Read Also: Kavitha : కవిత సంచలన వ్యాఖ్యలు..నాపై దుష్ప్రచారం, బీసీల కోసం పోరాడినందుకే సస్పెండ్..!

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ghosh Commission Report
  • High Court says no stay
  • kaleshwaram project
  • Kaleshwaram project irregularities
  • Stay
  • Telangana High Court

Related News

Telangana Assembly approves 42 percent reservation amendment bills for BCs

BC Reservation : రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు – హైకోర్టు

BC Reservation : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల (BC Reservation) అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లను 42% వరకు పెంచిన ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే

  • 42% Quota For Bcs

    42% Reservation: బీసీల స్వప్నం మళ్లీ మాటగా మారిందా?

Latest News

  • Harish Rao: భర్తను తలచుకొని ఏడుస్తే.. చిల్లర రాజకీయాలా? – హరీశ్‌రావు ఫైర్

  • Maoist Ashanna : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. లొంగిపోనున్న ఆశన్న టీమ్!

  • Bihar Elections : 25 ఏళ్ల సింగర్ కు బీజేపీ ఎమ్మెల్యే టికెట్

  • ‎Custard Apple: షుగర్ పేషంట్స్ సీతాఫలం తినవచ్చా.. తినకూడదా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!

  • ‎Sitting on Floor: నేలపై కూర్చొని తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. డైనింగ్ టేబుల్ కి బైబై చెప్పేస్తారు!

Trending News

    • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

    • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

    • Employees : ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..!

    • Bigg Boss : నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా.. ఇష్టం వచ్చినట్టు తింటా – దివ్వెల మాధురి..!

    • Tata Motors : ఒక్కరోజే 40 శాతం తగ్గిన టాటా మోటార్స్ షేర్ ధర!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd