Telangana Rains: తెలంగాణాలో విషాదం నింపిన భారీ వర్షాలు
తెలంగాణలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వందలాది మంది నిరాశ్రయులయ్యారు,
- By Praveen Aluthuru Published Date - 03:38 PM, Thu - 3 August 23
Telangana Rains: తెలంగాణలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వందలాది మంది నిరాశ్రయులయ్యారు, అనేక ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. భూపాలపల్లిలోని మొరంచపల్లి, మహబూబాబాద్లోని అర్పనపల్లి గ్రామం పరిస్థితి అధ్వన్నంగా మారింది. ఈ గ్రామాలు కాళేశ్వరం ప్రాజెక్టు ముంపుకు గురి కావడం ద్వారా నివాసితులు తమ ఇళ్లను కోల్పోయారు. కాగా..మోరంచపల్లి గ్రామంలో 22 మంది చనిపోగా..ముగ్గురు గల్లంతైనట్లు తెలుస్తుంది. సుమారు 900 మంది భారీ వర్షాలకు ప్రభావితమయ్యారని, దాదాపు 850 జంతువులు చనిపోనట్లు సమాచారం. ఈ గ్రామాలే కాకుండా ఇతర ప్రాంతాల్లోని గ్రామ వాసులు తినడానికి ఏమీలేక, స్వచ్ఛంద సంస్థలు పంపిణీ చేస్తున్న ఆహారంతో బతుకుతున్నారు. ప్రస్తుత రుతుపవనాల సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో 569.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఇది సాధారణ స్థాయి 378 మిమీ కంటే 51 శాతం ఎక్కువ. సిద్దిపేటలో అత్యధికంగా 100 శాతం. తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాల సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ ఎన్నడూ లేని విధంగా ములుగు జిల్లా అత్యధికంగా 24 గంటల వర్షపాతం నమోదైంది. ఇది అత్యధికంగా 24 గంటల వర్షపాతం 649.8 మి.మీ.హైదరాబాద్లో 441.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఇది సాధారణ స్థాయి 295.9 మిమీ కంటే 49 శాతం ఎక్కువ.
Also Read: Karnataka: జైల్లో ఉన్న భర్తకు గంజాయి సప్లై చేసిన మహిళ.. చివరికి?
Related News
Rain Alert : మే 20 వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తమగు చిరు జల్లులు పలకరిస్తూ చల్లపరుస్తూ వస్తున్నాయి. ఇక నిన్న గురువారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం పడింది