HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Gandhi Hospital Tops Highest Covid Patients Treatment In India

Gandhi Hospital:కోవిడ్ రోగుల సేవ‌ల్లో దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా గాంధీ” ఆసుప‌త్రి

దేశంలోనే పెద్ద సంఖ్యలో కరోనా సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న తొలి ఆసుపత్రిగా హైద‌రాబాద్ గాంధీ ఆసుపత్రి నిలిచింది. ఇప్పటివరకు దేశంలో అత్యధికంగా 84,127 మంది కోవిడ్ రోగులకు ఇక్క‌డ చికిత్స జ‌రిగింది.

  • Author : Hashtag U Date : 14-12-2021 - 9:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
gandhi hospital
gandhi hospital

దేశంలోనే పెద్ద సంఖ్యలో కరోనా సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న తొలి ఆసుపత్రిగా హైద‌రాబాద్ గాంధీ ఆసుపత్రి నిలిచింది.
ఇప్పటివరకు దేశంలో అత్యధికంగా 84,127 మంది కోవిడ్ రోగులకు ఇక్క‌డ చికిత్స జ‌రిగింది.
కోవిడ్ -19 వ్యాప్తి నుండి గాంధీ ఆసుపత్రిలో 84,127 మంది రోగులు కరోనావైరస్ బారిన పడి చికిత్స పొందారని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు తెలిపారు. ఇంత మంది రోగులకు దేశంలోని మరే ఆసుపత్రి కూడా చికిత్స చేయలేదని.. కోవిడ్‌కు చికిత్స పొందిన వారిలో 3,762 మంది 14 ఏళ్లలోపు పిల్లలు ఉన్నార‌ని ఆయ‌న తెలిపారు.వీరితో పాటు హై-రిస్క్ గ్రూపులకు చెందిన 8,178 మంది డయాలసిస్ రోగులు కూడా చికిత్స పొందార‌ని…. మెరుగైన చికిత్స అందించడం వల్ల 98 శాతం రికవరీ రేటును గాంధీ ఆసుపత్రి సాధించింద‌ని తెలిపారు.

ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 44 మంది కోవిడ్‌ రోగులు మాత్రమే చికిత్స పొందుతున్నారు. కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ రోగులకు కూడా వైద్యులు చికిత్స చేశారు. బ్లాక్ ఫంగస్ బాధితులు ఇప్పటి వరకు 1,786 మంది ఆసుపత్రిలో చేరారని… వీరిలో 1,163 మందికి శస్త్రచికిత్సలు చేసి ప్రాణాలు కాపాడామ‌ని వైద్యులు తెలిపారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి ఎక్కువ మంది బ్లాక్ ఫంగస్ రోగులు వచ్చారన్నారని తెలిపారు. క‌రోనా రెండ‌వ ద‌శ‌లో గాంధీ ఆసుప‌త్రిలో రోగుల తాకిడి ఎక్కువ అయింది. పూర్తిస్థాయిలో క‌రోనా రోగుల‌కు మాత్ర‌మే చికిత్స అందిస్తూ చాలామంది ప్రాణాల‌ను గాంధీ ఆసుప‌త్రి వైద్యులు కాపాడారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • covid patients
  • covid treatment
  • Gandhi hospital
  • hyderabad
  • telangana government hospital

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

    Latest News

    • Happier Life: ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటికి చోటివ్వండి..!!

    • Tamarind leaves: చింత చిగురు ఆ సమస్యలకు చెక్ పెడుతుంది…!!

    • Election Commission: ఏపీలో ‘SIR’ గడువు పెంపు!

    • Revanth Reddy: తెలంగాణ అభివృద్ధికి.. సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్!

    • AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd