HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Five Members Death In Kite Flying Incidents

Telangana : తెలంగాణ‌లో విషాదం.. గాలి ప‌టాలు ఎగుర‌వేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు యువ‌కులు

సంక్రాంతి పండుగ ప‌లు కుటుంబాల్లో విషాదం నింపింది. గత రెండు రోజులుగా గాలిపటాలు ఎగరేసిన ఘటనల్లో తెలంగాణ

  • Author : Prasad Date : 16-01-2024 - 7:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Deaths
Deaths

సంక్రాంతి పండుగ ప‌లు కుటుంబాల్లో విషాదం నింపింది. గత రెండు రోజులుగా గాలిపటాలు ఎగరేసిన ఘటనల్లో తెలంగాణ వ్యాప్తంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు యువకులు విద్యుదాఘాతంతో, పైకప్పుపై నుండి పడి ప్రాణాలు కోల్పోగా, మ‌రో యువ‌కుడు మంజా త‌గిలి మ‌ర‌ణించాడు. వీటిలో నాలుగు మరణాలు హైదరాబాద్‌లో నమోదు కాగా, పొరుగున ఉన్న సంగారెడ్డి జిల్లాలో ఒక యువకుడు మరణించాడు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్‌లోని తన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ టెర్రస్ నుండి పడి 20 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మృతుడు అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ రాజ‌శేఖ‌ర్ కుమారుడు ఆకాష్‌గా గుర్తించారు. ఆకాష్ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకాశ్ గాలిపటం ఎగురవేస్తూ ఐదంతస్తుల అపార్ట్ మెంట్ టెర్రస్ పై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని రెండంతస్తుల ఇంటి టెర్రస్‌పై గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుదాఘాతంతో 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్య‌క్తి సుబ్రహ్మణ్యం గా పోలీసులు గుర్తించారు. గాలిపటం ఎగురవేస్తుండగా హైటెన్షన్ వైరు తగిలి భవనంపై నుంచి పడిపోయాడు. అతడిని కాపాడే క్రమంలో భార్య చాముండేశ్వరి దేవికి గాయాలయ్యాయి.ఈ ఘ‌ట‌న‌లో దంపతులను సంగారెడ్డికి తరలిస్తుండగా మార్గమధ్యంలో సుబ్రహ్మణ్యం మృతి చెందాడు. అతని భార్య చికిత్స పొందుతోంది. సంక్రాంతిని జరుపుకోవడానికి సుబ్రహ్మణ్యం తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఇస్నాపూర్ నుంచి అత్తమామల ఇంటికి వ‌చ్చి దుర‌దృష్ట‌వ‌శాత్తు ప్ర‌మాదంలో మ‌ర‌ణించాడు.

We’re now on WhatsApp. Click to Join.

గతంలో హైదరాబాద్‌లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. శనివారం అత్తాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ భవనం టెర్రస్‌పై గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుదాఘాతంతో తనిష్క్ (11) మృతి చెందాడు. ఆ బాలుడు తన స్నేహితులతో కలిసి ఓ అపార్ట్‌మెంట్ భవనం పైకప్పుపై గాలిపటాలు ఎగురవేస్తున్నాడు. అదే స‌మ‌యంలో హైటెన్షన్ విద్యుత్ వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడ‌ని పోలీసులు తెలిపారు. రెండో ఘటనలో నాగోల్‌లో తన స్నేహితులతో కలిసి ఇంటి పైకప్పుపై గాలిపటం ఎగురవేస్తూ ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.నాగోల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కె.శివ ప్రసన్న (13) అనే విద్యార్థి గాలిపటం ఎగురవేస్తూ నాలుగు అంతస్తుల భవనం టెర్రస్‌పై నుంచి పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాగర్‌కర్నూల్‌లో గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుత్ తీగ తగిలి ఓ బాలుడు కూడా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.

Also Read:  Cock Fight : గోదావ‌రి జిల్లాల్లో రెండోరోజు జోరుగా సాగిన కోడిపందాలు.. చేతులు మారిన కోట్ల రూపాయ‌లు

లోహపు పూతతో కూడిన ‘మాంజా’ దారం విద్యుత్ ప్ర‌స‌రించే అవ‌కాశం ఉంద‌ని విద్యుత్ అధికారులు తెలాపారు. విద్యుత్ స్తంభాల దగ్గర గాలిపటాలు ఎగురవేయవద్దని విద్యుత్ అధికారులు ప్రజలకు సూచించారు.. చైనా మాంజా హైదరాబాద్‌లో ఓ సైనికుడి ప్రాణాలను బలిగొంది. కాగితాల కోటేశ్వర్ రెడ్డి (30) స్కూటీపై వెళుతుండగా చైనీస్ మాంజా అతని గొంతుకు త‌గిలి కోసుకుపోయింది. దీంతో అత‌ను మ‌ర‌ణించాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం లంగర్ హౌజ్‌లోని ఇంద్రకరణ్‌రెడ్డి ఫ్లైఓవర్‌పై చోటుచేసుకుంది. తీవ్ర రక్తస్రావమైన ఆర్మీ అధికారిని ఆసుపత్రిలో చేర్పించ‌గా.. అక్కడ అతను మరణించాడు. కోటేశ్వర్ రెడ్డి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా పెద్ద వాల్తేర్ అని పోలీసులు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • kite flying incidents
  • telangana

Related News

Nepali Gang Loots Gold In Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా దోచుకుంది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్‌కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడి

  • Heavy Rain Forecast for Telangana

    తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

  • KTR Delivers Strong Counter to Pawan's Remarks

    KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Janasena Pawan Kalyan

    JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

  • Janasena will contest in Telangana.

    Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

Latest News

  • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

  • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

  • Crime News Hyderabad: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు కు ఉరి శిక్ష, తల్లికి జీవిత ఖైదు

  • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

  • Nadendla Manohar: రేషన్ దుకాణాల్లో త్వరలో స్టీమ్‌ రైస్‌: మంత్రి నాదెండ్ల మనోహర్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd