Hyderabad: కన్న కూతుర్నే కడతేర్చిన తండ్రి.. ఇగో.. జరిగిన యదార్థ గాథ
హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. కిరాతక తండ్రి తన ఎనిమిదేళ్ల కుమార్తెను హతమార్చాడు. భార్యతో ఉన్న వివాహ వివాదాలే ఈ దారుణ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
- By Praveen Aluthuru Published Date - 02:00 PM, Sun - 20 August 23
Hyderabad: హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. కిరాతక తండ్రి తన ఎనిమిదేళ్ల కుమార్తెను హతమార్చాడు. భార్యతో ఉన్న వివాహ వివాదాలే ఈ దారుణ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కుండేటి చంద్రశేఖర్(40)గా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలిని బేబీ కుండేటి మోక్షజగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. (Crime Story)
కుండేటి చంద్రశేఖర్, హిమబిందుకు మర్చి 19, 2011లో వివాహం జరిగింది. హిమబిందు క్యాప్ జెమినీ(Capgemini) సాఫ్ట్వేర్ సంస్థలో మేనేజర్గా పని చేస్తున్నది. భర్త జూనియర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. భార్య కంటే భర్త తక్కువ సంపాదిస్తుండటంతో వీరి మధ్య తగాదాలు మొదలయ్యాయి. ఇదే విషయంపై రోజు గొడవ పడేవారు. వారి వివాహ బంధానికి మోక్షజ పుట్టింది. మోక్షజ బీహెచ్ఈఎల్లోని జ్యోతి విద్యాలయ హైస్కూల్లో 4వ తరగతి చదువుతుంది.
Also Read: Rajiv Gandhi: రాజీవ్ గాంధీ 79వ జయంతి: నివాళులు అర్పించిన మోడీ, రాహుల్, సోనియా
8 నెలల క్రితం భర్తకు ఉద్యోగం లేకపోవడంతో భార్య అతన్ని విడిచిపెట్టి, బీహెచ్ఈఎల్ (BHEL)లోని తన తల్లి ఇంటికి వెళ్ళిపోయింది. అప్పటి నుండి అతని భార్య అతనితో సరిగ్గా మాట్లాడటం లేదు. కుమార్తె మోక్షజను కూడా భర్తకు దూరంగా ఉంచడం ప్రారంభించింది. దీంతో కూతుర్ని ఆమెను చూడటానికి పాఠశాలకు వెళ్లేవాడు. బయటకు తీసుకెళ్లి కూతురికి కావాల్సిన వస్తువులు కొనిచ్చేవాడు. అయితే భార్య కూతురు, తల్లిదండ్రులతో చాలా సంతోషంగా ఉంటుందని భర్త భార్యపై పగ పెంచుకున్నాడు. భార్యపై పగ తీర్చుకోవాలని భావించి కూతురిని చంపేందుకు పథకం వేశాడు. తన పథకం ప్రకారం వారం రోజుల క్రితం చందానగర్లోని ఓ దుకాణంలో పదునైన కత్తిని కొని కూతురిని చంపే అవకాశం కోసం ఎదురు చూశాడు.
ఆగస్టు 18న మధ్యాహ్నం 03:15 గంటలకు తన కుమార్తె పాఠశాలకు వెళ్లి తన కారులో ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని బీహెచ్ఈఎల్ టౌన్షిప్కి వెళ్లి అక్కడ ఆగి వెనుక సీటులో కూర్చున్న తన కుమార్తె వద్దకు వెళ్లి కాసేపు మాట్లాడి తన సమస్యలను తన కూతురు తన తల్లితో మాట్లాడమని చెప్పిందని తెలిపారు. ఆపై నిందితుడు తన కుమార్తెను తన ఒడిలోకి తీసుకుని బలవంతంగా మెడను తెగ కోశాడు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. మృతదేహాన్ని హైదరాబాద్ శివార్లలో పడవేసేందుకు అదే కారులో ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడ వైపు వెళ్ళాడు. మార్గమధ్యంలో అతను ORRలో కోహెడ X రోడ్డు సమీపంలోకి చేరుకున్నప్పుడు, నిందితుడు డివైడర్ను ఢీకొట్టాడు, దాని కారణంగా కారు ముందు కుడి టైరు పగిలి ఆగిపోయింది. అప్పుడు ఓ వ్యక్తి కారులో మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Viral : సోషల్ మీడియా లో వైరల్ గా మారిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాసలీలలు
Related News
TS : గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం బాగానే ఉంది: సీఈఓ వికాస్ రాజ్
Telangana: రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్పై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్(Chief Election Officer Vikas Raj) మీడియాతో మాటాడారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం బాగానే ఉందని ఆయన తెలిపారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం 50 దాటిందన్నారు. ఇక హైదరాబాద్లో మాత్రమ ఎప్పటిలాగానే ఈ సారి కూడా తక్కువగానే 20 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర �