HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Farmers Should Not Be Disheartened Government Will Stand By Harish Rao

Harish Rao: రైతులు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది: హరీశ్ రావు

వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి హరీశ్ రావు (Harish Rao) తెలిపారు.

  • Author : Balu J Date : 26-04-2023 - 11:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao
Harish Rao

రైతులు ధైర్యంగా ఉండాలి. రైతు నాయకుడు ఉన్నటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం. రైతులు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దు. రైతుల పక్షపాతి అయిన నాయకుడు కేసీఆర్ ఉన్నారు. కాబట్టి ఎవరూ కూడా ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. నోటికాడి బుక్క జారిపోయిందని ఎంతో బాధతో ఉన్న రైతులను ఓదార్చడానికి సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి గ్రామాలలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఇప్పటికే వడగండ్ల వాన పడ్డ ప్రాంతాల్లో మొదటి దశలో పర్యటించి దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ప్రతీ ఎకరానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని మంత్రి వెల్లడి. జిల్లాలోని సిద్ధిపేట అర్బన్ మండలం, దుబ్బాక, తొగుట మండలాల్లో రాత్రి కురిసిన అకాల వడగండ్ల వానతో ఎంతో పంట నష్టం వాటిల్లిన ప్రాంతాలలో పర్యటిస్తూ.. రైతులను ఓదారుస్తున్న మంత్రి, జిల్లా అధికార బృందం.

భారత దేశంలో (India) ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా రూ.2, 3 వేలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కానీ సీఎం కేసీఆర్ స్వయంగా రైతుబిడ్డ కాబట్టి రైతులను కాపాడుకోవాలని, రైతులకు ధైర్యాన్ని ఇవ్వాలని ఇప్పటికే రూ.10వేలు ఆర్థిక సాయం ప్రకటించారని తెలిపారు. గ్రామాలలో నష్టపోయిన ఏ ఒక్కరైతు మిస్ కాకుండా వ్యవసాయ, రెవెన్యూశాఖ అధికారులు ఫీల్డ్ లో పర్యటించి వివరాలన్నీ ప్రభుత్వానికి వెంటనే పంపాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.

వాస్తవానికి యాసంగిలో ఎంతో నాణ్యమైన కరెంటు కోసం ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి, ప్రయివేటు ఎక్చేంజ్ లో కొని రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసింది. కానీ దురదృష్టం రైతుబంధు ఇచ్చి, నాణ్యమైన కరెంటు ఇచ్చి నోటి కాడికి వచ్చిన బుక్క జారిపోయినట్లు ఈ ప్రకృతి వైపరీత్యం వడగండ్ల వాన రూపంలో చాలా నష్టం జరిగిందని తెలిపారు. సిద్ధిపేట జిల్లాలోనే ఇప్పటికే 35 వేల ఎకరాల పంట నష్టం జరిగినట్లు వివరాలు వచ్చాయి. నిన్నరాత్రి జరిగిన ప్రకృతి వైపరీత్యంలో ఎంత నష్టం జరిగిందనే వివరాలు సాయంత్రం వరకు తెలుస్తాయి.

ఇప్పటికే సీఎం కేసీఆర్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, ఈ దరిమిలా అన్నీ జిల్లాలో గౌరవ మంత్రులు వడగండ్ల వాన పడ్డ ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వం పక్షాన రైతులకు ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నది. రైతులు అధైర్యపడొద్దు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. భవిష్యత్తులో మిమ్మల్ని కాపాడుకుంటాం. డిసెంబరు నెలలో రైతులు వరినాట్లు వేసిన దరిమిలా శ్రీరామ నవమి పండుగలోపు చాలా చోట్ల పంట కోతలు పూర్తయ్యాయి. మనం భవిష్యత్తులో నెలముందే పంట కోత తెచ్చుకోగలిగితే ఈ ప్రకృతి వైపరీత్యం నుంచి తప్పించుకునే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. వానా కాలం పంట ఒక నెల ముందు జరుపుకుంటే ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోకుండా ఉంటామని రైతులకు మంత్రి (Harish Rao) హితవు పలికారు.

Also Read: Fish Medicine: చేపమందు పంపిణీకి రంగం సిద్ధం!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • farmers
  • harish rao
  • siddipet
  • telangana

Related News

Rythu Bharosa

రైతు భ‌రోసా ప‌థ‌కం ర‌ద్దు.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం!

రైతు భరోసా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వం ఆపడం లేదు. నిలిపివేసే ఆలోచన కూడా లేదు.

  • Ias Officers Transfer In Te

    తెలంగాణ లో పెద్ద ఎత్తున ఐఏఎస్‌ల బదిలీలు

  • Uttam Krishna Water

    కృష్ణా జలాల వివాదం, కేసీఆర్ ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ ఘాటు కౌంటర్

  • Uttam Kumar Reddy

    బీఆర్‌ఎస్‌ పై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విసుర్లు..పాలమూరు’పై ఖర్చు చేసిన రూ. 7 వేల కోట్లకు లెక్క చెబుతా!

  • Telangana New Sarpanches

    సంక్రాంతి తర్వాత సర్పంచ్ లకు ట్రైనింగ్

Latest News

  • ఈ ఏడాది గంభీర్ కోచింగ్‌లో భారత జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న ఎలా ఉందంటే?!

  • సీఈవో అంటే ఇలా ఉండాలి.. ఉద్యోగుల కోసం రూ. 21.55 కోట్లు!

  • న్యూజిలాండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధం.. కెప్టెన్సీ బాధ్యతలు అత‌నికే!

  • చిరు-వెంకీల మెగా విక్టరీ మాస్ సాంగ్.. డిసెంబర్ 30న విడుదల!

  • ఎయిర్ ప్యూరిఫైయర్‌లపై జీఎస్టీ తగ్గింపుకు కేంద్రం నిరాకరణ!

Trending News

    • చైనా ఆయుధాల వైఫల్యం.. పేలిపోయిన రాకెట్ సిస్టమ్!

    • పిజ్జా వదిలేసి.. మటన్ ప్రియుడిగా మారిన టీమిండియా యంగ్ క్రికెట‌ర్‌!

    • 2027 వన్డే వరల్డ్ కప్‌కు విరాట్ కోహ్లీ సిద్ధం: కోచ్

    • ఊడిపోయిన జుట్టును అమ్ముతున్నారా? తస్మాత్ జాగ్రత్త!

    • సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. మరో 3 సెంచరీలు చేస్తే చరిత్రే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd