Padi Kaushik Reddy : పాడి కౌశిక్ రెడ్డి ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఫై నివేదిక కోరిన ఈసీ
ప్రచార చివరి రోజు కన్నీరు పెట్టుకుంటూ ఓటర్లను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు గురి చేసారని
- Author : Sudheer
Date : 29-11-2023 - 12:44 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ముగిసింది..ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం 5 గంటల వరకు అంత ప్రచారం పూర్తి చేసారు. చివరి రోజున అన్ని పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకున్నారు. అయితే హుజురాబాద్ (Huzurabad) బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy)..ప్రచార చివరి రోజు కన్నీరు పెట్టుకుంటూ ఓటర్లను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు గురి చేసారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఈసీ కి పిర్యాదు చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
కార్నర్ మీటింగ్లో ఓటర్లను ఉద్దేశించి కౌశిక్ మాట్లాడుతూ.. ‘మీకు దండం పెడతా.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నాకు ఓటేసి గెలిపించండి. నేను చేయాల్సిన ప్రచారం చేశా.. ఇక సాదుకుంటరో, సంపుకుంటరో మీ ఇష్టం. ఓట్లేసి గెలిపిస్తే నాలుగో తారీఖున నేను విజయయాత్రతో వస్తా.. లేకపోతే నా శవయాత్రకు మీరు రండి’ అంటూ కౌశిక్ రెడ్డి ఓటర్లను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు. ఈ వ్యాఖ్యలనే ఈసీ నివేదిక కోరింది.
తొలిసారి టికెట్ దక్కించుకున్న కౌశిక్ రెడ్డి ఎలాగైనా గెలిచి తీరాలని తీవ్రంగా ట్రై చేస్తున్నాడు. కేవలం ఆయన ఒక్కడే కాదు ఫ్యామిలీ సభ్యులందర్నీ ప్రచారంలోకి తీసుకొచ్చారు. గత కొద్దీ రోజులుగా కౌశిక్ తో పాటు ఆయన భార్య , కూతురు సైతం నియోజకవర్గం లో విస్తృతంగా ప్రచారం చేస్తూ..ఒక్క ఛాన్స్ తన భర్త కు ఇవ్వాలని కోరుతుంది..మరోపక్క మా తండ్రికి రాజకీయాలంటే ఎంతో ఇష్టమని..ప్రజలకు సేవ చేయాలనీ ఎప్పుడు తప్పించిపోతారని..ఒక్క ఛాన్స్ నా తండ్రికి ఇవ్వండి..నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తారని హామీ ఇస్తూ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో చివరి రోజు ప్రచారంలో పాల్గొన్న కౌశిక్ రెడ్డి తనను కచ్చితంగా గెలిపించాలని కోరారు. గెలవడమో తన కుటుంబం ఆత్మహత్య చేసుకోవడమో రెండే మార్గాలని అభిప్రాయపడ్డారు. మరి ఈసీ నివేదిక ఫై కౌశిక్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Read Also : WhatsApp Channels : వాట్సాప్ ఛానల్స్లో రెండు కొత్త ఫీచర్లు